లిక్కర్ షాపులో దొంగతనం: ముసుగులతో హల్ చల్

లిక్కర్ షాపులో దొంగతనం: ముసుగులతో హల్ చల్

మూసి ఉన్న షాపులోకి చొరబడి రూ.2లక్షల నగదు, రూ.3లక్షల మద్యం తీసుకుని ఉడాయించారు ముసుగుదొంగలు. ఈ ఘటన అజ్మీర్ లో జరిగింది. ఆరుగురు వ్యక్తులు ముసుగులతో పాటు తుపాకీ తీసుకుని లిక్కర్ షాపులో చొరబడ్డారు. గ్రిల్ విరగ్గొట్టి లోపలికి వచ్చారు. 

లోపల ఉన్న సేల్స్‌మన్ మాగన్ సింగ్ అరవడంతో తుపాకీతో బెదిరించి నోరు మూయించారు. ఆ తర్వాత తాళ్లతో కట్టేసి గోడౌన్ లోకి విసిరేశారు. అక్కడ ఉన్న నగదు, లిక్కర్ బాటిళ్లను వాన్ లోకి ఎక్కించారు. అదే సమయంలో ఈ చోరీని ఇద్దరు స్టూడెంట్లు చూశారు. తుపాకీని చూసి భయపడిన వారు అక్కడి నుంచి వెళ్లిపోయి ఆ దుండగులు వెళ్లిపోయిన తర్వాత వచ్చి ఆ సేల్స్ పర్సన్ ను కాపాడారు. 

షాపు ఓనర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరుపుతామని వీలైనంత త్వరగా నేరస్థులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.