Sonali Phogat: సోనాలి ఫోగట్ ఒంటిపై గాయాలు.. పోస్టుమార్టమ్ నివేదికలో వెల్లడి

రెండు రోజుల క్రితం గోవాలో మరణించిన బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ పోస్టుమార్టమ్ నివేదిక కలకలం రేపుతోంది. పోలీసులు ఆమె గుండెపోటుతో మరణించిందని చెప్పినప్పటికీ, తాజా నివేదికలో ఆమె ఒంటిపై గాయాలున్నట్లు తేలింది. దీంతో హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Sonali Phogat: ఇటీవల మరణించిన బీజేపీ నేత, బిగ్‌బాస్ ఫేం సోనాలి ఫోగట్ పోస్టుమార్టమ్ నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పోలీసులు ఆమె గుండెపోటుతో మరణించిందని చెప్పగా, తాజా పోస్టుమార్టమ్ నివేదికలో ఆమె ఒంటిపై గాయాలున్నట్లు తేలింది. దీంతో సోనాలి మృతిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

CM KCR: పంటలు పండే తెలంగాణ కావాలా.. మత పిచ్చితో రగిలే మంటల తెలంగాణ కావాలా? ప్రశ్నించిన సీఎం కేసీఆర్

మరోవైపు ఆమె కుటుంబ సభ్యులు కూడా సోనాలి మృతిపై ముందునుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారు ఆమె మరణంపై హత్య కోణంలో దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు, తాజా పోస్టుమార్టమ్ నివేదిక నేపథ్యంలో గోవా పోలీసులు సోనాలి మరణంపై హత్య కేసు నమోదు చేశారు. సోనాలి ఫోగట్ ఆగష్టు 23న గోవాలో మరణించింది. మొదట ఆమె గుండెపోటుతో మరణించిందని భావించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను, తన అసిస్టెంట్స్ సుధీర్ సాగ్వాన్, సుఖ్వీందర్ సింగ్ గోవాలోని సెయింట్ ఆంథోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన జరిగే సమయంలో ఆమెతోపాటు ఉన్న ఇద్దరు అసిస్టెంట్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి.. 27న హన్మకొండలో భారీ సభ

ప్రస్తుతం పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతకుముందు ఆమె పోస్టుమార్టాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో నిర్వహించాలని కోరారు. అయితే, అది సాధ్యం కాదని.. గోవాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహిస్తామని పోలీసులు నచ్చచెప్పారు. దీంతో దీనికి ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించారు.

 

ట్రెండింగ్ వార్తలు