శ్రీనివాస రెడ్డి సైకో కిల్లర్ : మహేష్ భగవత్ 

  • Published By: chvmurthy ,Published On : April 30, 2019 / 02:58 PM IST
శ్రీనివాస రెడ్డి సైకో కిల్లర్ : మహేష్ భగవత్ 

హైదరాబాద్: సీరియల్ రేప్స్ అండ్ మర్డర్స్ కేసులో ప్రధాన నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని రావిరాల గ్రామంలో ఉండగా అరెస్ట్ చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ చెప్పారు. 2015 నుండి ఇప్పటి వరకు నిందితుడు ముగ్గురు మైనర్ అమ్మాయిలపై అత్యాచారం చేసి హత్య చేశాడని ఆయన తెలిపారు. “2015లో కల్పన అనే 11 ఏళ్ల చిన్నారిని రేప్ చేసి హత్య చేశాడు. డెడ్ బాడీని గొనె సంచిలో చుట్టి బావిలో పడేశాడు. 2015 సెప్టెంబర్ 28న 38 ఏళ్ల సువర్ణ అనే మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయంలో బొమ్మలరామరం పోలీసు స్టేషన్లో కేస్ బుక్ అయ్యింది. ఆ సమయంలో శ్రీనివాస్ రెడ్డిని గ్రామస్తులు కొట్టారని, దీనితో అతడు సైకోలా మారాడని” ఆయన వివరించారు. శ్రీనివాస్ రెడ్డి మద్యానికి, గంజాయి కి బానిసై, నీలి చిత్రాలు చూడటం అలవాటుగా చేసుకున్నాడని ఆయన తెలిపారు.

2016లో కర్నూల్ లో సెక్స్ వర్కర్ తో డబ్బుల విషయంలో గొడవ జరగటంతో ఆమెను హత్యచేసి డెడ్ బాడీని వాటర్ ట్యాంక్ లో పడేసి పారిపోయాడు. 2019 మార్చి 9న 17ఏళ్ల  మనీషా పై అత్యాచారం చేసి హత్య చేశాడు. డెడ్ బాడీని బావిలో పూడ్చి పెట్టాడు. ఇప్పుడు శ్రావణి అనే మైనర్ బాలికను రేప్ చేసి హత్య చేశాడని మహేష్ భగవత్ తెలిపారు. శ్రావణికి మత్తు మందు ఇచ్చి ఆ తరువాత బావిలోకి తోసేశాడు. అనంతరం బావిలోకి దిగి అత్యాచారం చేసి హత్యచేసి డెడ్ బాడీని పూడ్చేశాడని ఆయన చెప్పారు. అయిదు కేసుల్లో శ్రీనివాస్ రెడ్డి నిందితుడని, రిమాండ్ తరువాత కస్టడీలోకి తీసుకొని మరోసారి విచారిస్తామని పోలీసు కమీషనర్ తెలిపారు.  ఎవరైనా అపరిచిత వ్యక్తులు లిఫ్ట్ ఇస్తామని చెప్పి బైక్ కానీ, స్కూటర్ కానీ  ఎక్కమంటే, నమ్మి వారి బైక్ లు స్కూటర్లు ఎక్కవద్దు అని, ఈ విషయమై తల్లిదండ్రులు పిల్లలకు తగిన జాగ్రత్తలు చెప్పాలని ఆయన సూచించారు.