నటి వనితపై విమర్శలు చేసిన సూర్యాదేవికి కరోనా..ఇప్పుడు ఎక్కడున్నారు

  • Published By: madhu ,Published On : July 29, 2020 / 08:33 AM IST
నటి వనితపై విమర్శలు చేసిన సూర్యాదేవికి కరోనా..ఇప్పుడు ఎక్కడున్నారు

నటి వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి చేసుకోవడంపై విమర్శలు చేసిన సూర్యాదేవి ఎక్కడున్నారు ? ఆమెకు కరోనా వైరస్ సోకిందా అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. పోలీసులు ఆమెపై రెండు కేసులు నమోదు చేశారు. వీడియోల ద్వారా వనితాపై విమర్శలు చేసి వార్తల్లో ఎక్కారు. జులై 22వ తేదీన వనితా ఫిర్యాదుతో వడపళని మహిళా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.



అనంతరం ఆమెకు బెయిల్ వచ్చింది. నిబంధనల ప్రకారం…సూర్యాదేవికి కరోనా పరీక్ష నిర్వహించారు. మహిళ పోలీస్ స్టేషన్ లో సూర్యాదేవిని విచారించిన పోలీసు అధికారి కూడా పరీక్షలు నిర్వహించుకున్నారు. ఇద్దరికీ కరోనా సోకినట్లు ఫలితాల్లో వెల్లడైంది. ఈ క్రమంలో ఆరోగ్య శాఖాధికారులు ఆమె ఇంటికి వెళ్లగా కనిపించడం లేదని తెలిసింది.

అయితే..తాను ఎక్కడకు వెళ్ల లేదని సూర్యాదేవి వీడియో ద్వారా వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆమె వల్ల ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఉందని, కరోనా వ్యాప్తికి పాల్పడుతోందని చేసిన ఫిర్యాదుపై విరుగంబాక్కమ్ పోలీసులు సూర్యాదేవిపై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె కోసం గాలిస్తున్నారు.



సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ దంపతుల పెద్ద కూతురు వనిత విజయ్ కుమార్ వివాహం పీటర్ పాల్‌తో జూన్ 27వ తేదీన చెన్నైలో ఘనంగా జరిగింది. లాక్‌డౌన్ నేపథ్యంలో గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం అతికొద్ది మంది సన్నిహితుల మధ్య క్రిస్టియన్ పద్ధతిలో వీరి వివాహం జరిగింది. 1999లో ‘దేవి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యారు వనిత.