Suryapet : బదిలీపై వెళ్ళాల్సిన ఎస్ఐ.. ఏసీబీ అధికారులకు చిక్కాడు

మరో 24 గంటల్లో బదిలీపై వెళ్లాల్సిన ఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.

Suryapet : బదిలీపై వెళ్ళాల్సిన ఎస్ఐ.. ఏసీబీ అధికారులకు చిక్కాడు

arrested

Suryapet :  మరో 24 గంటల్లో బదిలీపై వెళ్లాల్సిన ఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.

సూర్యాపేట రూరల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లవకుమార్ బుధవారం రాత్రి వీఆర్‌కు బదిలీ అయ్యారు. శుక్రవారం మార్చి25న రిలీవ్ అయి హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. కానీ గురువారం మధ్యాహ్నం ఆయన ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ చిక్కాడు.

సూర్యాపేట మండల పరిధిలో రాజుగారి తోట పేరుతో ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ యాజమాన్యం నుంచి రూ. 1.30 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం గత కొన్ని రోజులుగా లవకుమార్ హోటల్ యాజమాన్యాన్ని పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.
Also Read : Nara Lokesh : ఇక ప్రజాక్షేత్రంలోకి టీడీపీ నేతలు.. ముహుర్తం ఫిక్స్
హోటల్ సజావుగా సాగాలంటే లక్షన్నర ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసీబీని ఆశ్రయించటంతో గురువారం రూ. 1.3 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. లవకుమార్ ను అరెస్ట్ చేసిన  అధికారులు  హైదరాబాద్ లోని ఏసీబీ కోర్టుల ప్రత్యేక మొదటి అదనపు  న్యాయమూర్తి ఎదుట హజరు పరిచారు.