క్లాస్ రూమ్ లో నుంచి లాక్కొచ్చి…టీచర్ ని చావగొట్టిన విద్యార్థులు

  • Published By: venkaiahnaidu ,Published On : November 6, 2019 / 01:27 AM IST
క్లాస్ రూమ్ లో నుంచి లాక్కొచ్చి…టీచర్ ని చావగొట్టిన విద్యార్థులు

ఉత్తరప్రదేశ్ లో ఓ ఉపాధ్యాయుడిపై విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. బల్కారన్ పూర్ లోని ఆదర్శ్ జనతా ఇంటర్ కాలేజీ లో క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయుడిని బయటకు తీసుకొచ్చి కర్రలతో చావగొట్టారు. విద్యార్థుల బంధువులు కూడా ఉపాధ్యాయుడిని కొట్టారు.

విద్యార్థినిలతో తప్పుగా ప్రవర్తిస్తున్నారంటూ తిట్టాడన్న కోపంతో విద్యార్థులు ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. టీచర్ పై దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాడికి పాల్పడినవారిపై ఎఫ్ఐఆర్ నమోదుచేశామని,త్వరలోనే వారిని అరెస్ట్ చేయనున్నట్లు ప్రయాగ్ రాజ్ ఎస్పీ తెలిపారు.