Telangana : భూత వైద్యం పేరుతో చిత్రహింసలు..బాలికను నిప్పుల కుంపటిలో కాళ్లు పెట్టించిన వైనం

వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ శివారులో ఓ భూత వైద్యుడి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ధారూర్ మండలం కుక్కింద చెందిన 12ఏళ్ల బాలికకు భూత వైద్యం పేరుతో కాళ్లు కాలిపోయేలా చేశాడు. బాలిక కాళ్లు చేతులు నిప్పులల్లో పెట్టి కాల్చాడు.రెండు కాళ్లు కుళ్లిపోయిన స్థితిలో ఉండా కాళ్లు తీసేయాల్సి వస్తుందని డాక్టర్లు తెలిపారు.

Telangana : భూత వైద్యం పేరుతో చిత్రహింసలు..బాలికను నిప్పుల కుంపటిలో కాళ్లు పెట్టించిన వైనం

Exorcist Torture Inter Girl Student In Pargi Vikarabad

Vikarabad: ఈ కంప్యూటర్ యుగంలో కూడా దెయ్యాలు..భూతాలు అంటూ నమ్మేవారే టార్గెట్ లో కొంతమంది మాయగాళ్లు అకృత్యాలకు పాల్పడతున్నారు.భూత వైద్యం పేరుతో చిత్రహింసలకు గురి చేస్తున్నారు.అటువంటిదే జరిగింది తెలంగాణాలోని వికారాబాద్ జిల్లాలో. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ శివారులో ఓ బురిడీ బాబా వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ధారూర్ మండలం కుక్కింద చెందిన 12ఏళ్ల బాలికకు భూత వైద్యం పేరుతో కాళ్లు కాలిపోయేలా చేశాడు. బాలిక కాళ్లు చేతులు నిప్పుల కుంపటి కాల్చాడు. ఆ తర్వాత చేతులెత్తేశాడు. దీంతో చేసేదేమీ లేక తీవ్రగా గాయపడిన బాలికను వెంటనే వికారాబాద్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆపరేషన్ చేసిన వైద్యులు 24 గంటలు గడిస్తే గానీ చెప్పలేమంటున్నారు. దీంతో కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. కాళ్లు రెండూ తీసేయాల్సి వస్తుందేమోనని చెబుతున్నారు డాక్టర్లు. దీంతో సదరు బాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

భూతవైద్యం పేరుతో దారుణమైన చిత్రహింసలు..
వికారాబాద్ జిల్లా ధారూరు మండలం కుక్కింద గ్రామానికి చెందిన మంజుల వెంకటయ్య 17 ఏళ్ల కుమార్తె అశ్విని వికారాబాద్లోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె ఇటీవల అనారోగ్యానికి గురయ్యింది. పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన వారి సమీప బంధువు.. తమ గ్రామంలోని దర్గా సమీపంలో ఓ భూతవైద్యుడు ఉన్నాడని, ప్రతి శుక్రవారం భూతవైద్యం చేస్తాడని అశ్విని తల్లిదండ్రులకు తెలిపింది. ఈ క్రమంలో గత శుక్రవారం బాలికను అతడి వద్దకు తీసుకువెళ్లగా బాలికకు దెయ్యం పట్టిందని నమ్మించాడు. దెయ్యం వదిలిస్తానంటూ బాలికను చిత్రహింసలకు గురిచేశాడు.

మండే నిప్పులపై బాలికను నడిపించడంతో పాటు.. ఆమెపై కాళ్ళు పెట్టి నిలుచున్నాడు.దీంతో బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు బంధువుల సహాయంతో వికారాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగాలేదని… పాదాలు కుళ్లిపోయిన పరిస్థితిలో ఉందని ప్రస్తుతం సర్జరీ చేశామని ఇన్ ఫెక్షన్ పోకుండే కాళ్లను తీసివేయాల్సి వస్తుందని తెలిపారు డాక్టర్లు. ప్రస్తుతం సదరు భూత వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.