Bandi Tour : ఉత్కంఠ రేపుతున్న బండి రెండో రోజు పర్యటన

బండి సంజయ్ నల్గొండ పర్యటన ఉద్రిక్తతకు దారితీసిన తరుణంలో రెండవ రోజు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు సూర్యాపేట జిల్లాలో బండి పర్యటించనున్నారు.

Bandi Tour : ఉత్కంఠ రేపుతున్న బండి రెండో రోజు పర్యటన

Bandi Tour

Bandi Tour :  ధాన్యం విషయంలో సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు బండి సంజయ్‌. కేసీఆర్‌ బాధ్యతను మరచి మాట్లాడుతున్నారని విమర్శించారు. సోమవారం నల్గొండ జిల్లాలో పర్యటించిన బండి రైతులతో ముచ్చటించారు. అనంతరం అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. పండిన ప్రతి గింజా కొంటామని గతంలో చెప్పి.. ఇప్పుడు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇటు బండి సంజయ్‌ కారుపై దాడిని సీరియస్‌గా తీసుకున్న బీజేపీ నాయకత్వం.. అధికార పార్టీకి దీటుగా జవాబు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించనుంది.

చదవండి : Bandi Sanjay : రైతుల పట్ల గజినిగా మారిన సీఎం కేసీఆర్ : బండి సంజయ్

ఇవాళ సాయంత్రం 5 గంటలకు జనగామలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల అత్యవసర సమావేశం జరగనుంది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో తమపై టీఆర్ఎస్‌ దాడులను సీరియస్‌గా తీసుకున్న బీజేపీ… అధికార పార్టీకి దీటుగా జవాబు చెప్పేందుకు కార్యాచరణ రూపొందించనుంది. ఈ కార్యక్రమానికి బండి హాజరయ్యే అవకాశం ఉంది.

చదవండి : Bandi Sanjay : బండి సంజయ్ ను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు

ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించనున్నారు బండి సంజయ్‌. తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పుల, జనగామ మండలాల్లో పర్యటించనున్నారు. ప్రధానంగా మార్కెట్‌లో ధాన్యం అమ్మకంపై ఎదురవుతున్న ఇబ్బందులు, కనీస మద్దతు ధర రాక రైతులు పడుతున్న కష్టాలను స్వయంగా పరిశీలించనున్నారు. అయితే.. తొలిరోజు పర్యటన ఉద్రిక్తత నేపథ్యంలో ఇవాళ్టి పర్యటన ఉత్కంఠ రేపుతోంది.