hyderabad : డబ్బుల కోసం సొంత మామనే హత్య చేసిన అల్లుడు

హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లో దారుణం జరిగింది. డబ్బుల కోసం ఓ వ్యక్తి సొంత మామనే హత్య చేశాడు. రియల్‌ఎస్టేట్‌ బిజినెస్‌లో కమీషన్‌ ఇవ్వలేదని కొడవలితో సొంత మామనే నరికాడు అల్లుడు.

hyderabad : డబ్బుల కోసం సొంత మామనే హత్య చేసిన అల్లుడు

Kill

Son-in-law killed uncle : మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. మనుషుల మధ్య బంధాలకంటే డబ్బే ప్రధానమైంది. డబ్బు కోసం ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. చివరకు ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లో దారుణం జరిగింది. డబ్బుల కోసం ఓ వ్యక్తి సొంత మామనే హత్య చేశాడు.

రియల్‌ఎస్టేట్‌ బిజినెస్‌లో కమీషన్‌ ఇవ్వలేదని కొడవలితో సొంత మామనే నరికాడు అల్లుడు. ఈ ఘటన హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో చోటుచేసుకుంది. రియల్టర్ రవీందర్‌రెడ్డి ఇంట్లో ఉన్న సమయంలో నిన్న తన అల్లుడు మోహన్‌రెడ్డి దాడి చేశాడు. ప్లాట్ కొనుగోలులో 6 లక్షల రూపాయల కమీషన్ విషయంపై గొడవ జరిగింది. ఈ క్రమంలో మోహన్‌రెడ్డి తన మామపై కొడవలితో దాడి చేశాడు.

Tragedy : కర్నూలు జిల్లాలో విషాదం..నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి
దీంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రవీందర్‌రెడ్డి ఇవాళ ఉదయం మృతి చెందాడు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రవీందర్‌రెడ్డి…మాజీ గ్రంధాలయ చైర్మన్‌గా పని చేశారు. 2005 నుంచి 07 వరకు సంగినోనిపల్లి సర్పంచ్‌గా ఉన్నారు. నిందితుడు మోహన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.