Huzurabad By Poll : రూ. 25 కోట్లకి రేవంత్ రెడ్డి అమ్ముడుపొయాడు – కౌశిక్

బీజేపీ గెలుపుకోసం రేవంత్ రెడ్డి పనిచేశారని సంచలన ఆరోపణలు చేశారు కౌశిక్ రెడ్డి.. ఇందుకోసం ఆయన రూ.25 కోట్లు తీసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Huzurabad By Poll : రూ. 25 కోట్లకి రేవంత్ రెడ్డి అమ్ముడుపొయాడు – కౌశిక్

Huzurabad By Poll (4)

Huzurabad By Poll : హుజూరాబాద్ ఉపఎన్నికల హడావిడి ముగిసింది. ఈ ఎన్నికల్లో 24,068 ఓట్ల భారీ మెజారిటీతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. 22 రౌండ్లలో జరిగిన కౌంటింగ్‌లో 20 రౌండ్లలో ఆధిక్యం కనబరిచారు ఈటల. ఈటల విజయంతో బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.

చదవండి : Huzurabad By Poll : అణచివేతపై రేపటినుంచే నా పోరాటం – ఈటల

ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఉపఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడారు.. హుజూరాబాద్ ప్రజలకు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ కోసం పనిచేసిన ప్రతిఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు కౌశిక్.. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేశాయని ఆరోపించారు.

చదవండి : Huzurabad : ఈటల మెజారిటీ ఎంతో తెలుసా…? రౌండ్ వారీగా ఓట్ల వివరాలు

గత ఎన్నికల్లో 60,000 ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 3,000 ఓట్లకు పడిపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. దీనికంతటికి రేవంత్ రెడ్డే కారణమని.. ఆయన బీజేపీ గెలుపు కోసం పనిచేశారని.. ఇందుకోసం బీజేపీ నుంచి రూ.25 కోట్లు తీసుకున్నారని ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని బహినపరిచాడని మండిపడ్డారు.