Omicron : ఒమిక్రాన్‌ను ఎదుర్కోటానికి తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు

ఒమిక్రాన్‌ని సమర్ధవంతంగా ఎదుర్కొవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అయ్యింది. విదేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేసిన అనంతరం హోమ్ క్వారంటైన్‌లో ఉంచేలా ప్రభుత్వం  చర్యల

Omicron : ఒమిక్రాన్‌ను ఎదుర్కోటానికి తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు

TS Govt Alert on Omicron

Omicron :  ఒమిక్రాన్‌ని సమర్ధవంతంగా ఎదుర్కొవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అయ్యింది. విదేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేసిన అనంతరం హోమ్ క్వారంటైన్‌లో ఉంచేలా ప్రభుత్వం  చర్యలు చేపట్టింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ‌ని నియమించింది సర్కార్.

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్’ ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి , టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల కోసం క్యాబినెట్ సబ్ కమిటీ నియమించింది ప్రభుత్వం. ఈ సబ్ కమిటీలో వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు చైర్మన్ గా .. అర్బన్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి కె.టి.ఆర్., పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లు సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ సన్నద్దత, అనుసరిస్తున్న కార్యాచరణ, రాష్ట్ర వ్యాప్తంగా  కోవిడ్ టీకాల పురోగతి, మందుల లభ్యత, ఆక్సిజన్ బెడ్స్ సామర్థ్యం, తదితర అంశాలపై కేబినెట్ సమీక్షించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ పై వైద్యశాఖ అధికారులు క్యాబినెట్‌కు నివేదిక అందించారు.
Also Read :Alcohol Bottles : అసెంబ్లీ ఆవరణలో మద్యం బాటిళ్లు.. సీఎం రాజీనామాకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు
కరోనా పరీక్షలు మరిన్ని ఎక్కువగా చేయడానికి అవసరమైన ఏర్పాట్లు సన్నద్దతపై కేబినెట్ చర్చించింది. అదే  సందర్భంలో, కరోనా నుంచి  ’’ఒమిక్రాన్’’ పేరుతో కొత్త వేరియంట్ వస్తున్నదనే వార్తల నేపథ్యంలో ఈ కొత్త కరోనా వేరియంట్ గురించి వైద్య అధికారులు కేబినెట్ కు వివరించారు. వివిధ దేశాల్లో ఒమిక్రాన్ పరిస్థితి ని తెలిపారు. నివేదిక సమర్పించారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా కట్టడి కోసం జరిగిన పురోగతి మీద కేబినెట్ చర్చించింది.

వైద్యశాఖ పూర్తి సన్నద్ధతతో ఉన్నదని, అన్ని రకాల మందులు, పరికరాలు , మానవ వనరులు, పూర్తిగా అందుబాటులో ఉన్నాయని.. అన్ని రకాలుగా తాము సంసిద్దంగా ఉన్నామని వైద్యాధికారులు కేబినెట్ కు వివరించారు. రాష్ట్రంలోని అన్ని దవాఖానాలల్లోని పరిస్థితులను సమీక్షించాలని, అన్ని రకాల మందులు, టీకాలతో సహా ఇతరత్రా అవసరమైన  మౌలిక వసతులను సమకూర్చుకోవాలని, ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి రాష్ట్ర వైద్యశాఖ సిద్దంగా వుండాలని కేబినెట్ ఆదేశించింది.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, అందుకు మంత్రులందరూ వారి వారి జిల్లాల్లో  సమీక్షించాలని, అవసరమైన వారందరికీ  సత్వరమే టీకా ఇప్పించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. జిల్లాల వారిగా టీకా ప్రక్రియ ను సమీక్షించి., అదిలాబాద్, కుమురంభీం నిర్మల్, మహబూబ్ నగర్, నారాయణ పేట, గద్వాల్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది.