Meena Jewelers : హైదరాబాద్ మీనా జ్యువెలర్స్ పై మూడు సీబీఐ కేసులు నమోదు

ఎస్‌బీఐ ఆధ్వర్యలోని కన్సార్టియం నుంచి రూ. 364.2 కోట్ల రుణం తీసుకుని మోసం చేశారని సీబీఐ అంటోంది. 2015 నుంచి 2019 మధ్య కాలంలో ఈ కంపెనీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది.

Meena Jewelers : హైదరాబాద్ మీనా జ్యువెలర్స్ పై మూడు సీబీఐ కేసులు నమోదు

Cbi

Hyderabad Meena Jewelers : బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన కేసులో హైదరాబాద్‌కు చెందిన మీనా జ్యువెలర్స్ పై సీబీఐ మూడు కేసులు నమోదు చేసింది. కంపెనీతో పాటు ఆ కంపెనీ డైరెక్టర్‌ అయిన ఉమేష్‌ జేత్వానిపై కూడా కేసు నమోదు చేశారు. ఎస్‌బీఐ ఆధ్వర్యలోని కన్సార్టియం నుంచి రూ. 364.2 కోట్ల రుణం తీసుకుని మోసం చేశారని సీబీఐ అంటోంది. 2015 నుంచి 2019 మధ్య కాలంలో ఈ కంపెనీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది.

మీనా జువెల్లర్స్‌ డైమండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మీనా జ్యువెలర్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మీనా జ్యువెలర్స్ ఎక్స్‌క్లూజివ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు బ్యాంకుల నుంచి రుణాలు పొందాయి. ఈ కంపెనీల ప్రస్తుత ఓనర్లతో పాటు పాత ప్రమోటర్లు కూడా తీసుకున్న రుణాలకు ఖాతాలను చూపలేకపోయారు. 2016 నుంచి 2020 మధ్యకాలంలో మీనా జ్యువెలర్స్ అండ్‌ డైమండ్స్‌ కంపెనీ రూ. 810 కోట్ల విలువైన లావాదేవీలను నిర్వహించింది.

Karvy : బ్యాంక్ రుణాల ఎగవేత.. కార్వీ ఎండీ పార్థసారధి రెడ్డికి 14 రోజుల రిమాండ్

అయితే బ్యాంకుల్లో కేవలం రూ. 70 కోట్లు మాత్రమే జమ చేసిందని బ్యాంకులు అంటున్నాయి. మీనా జ్యువెలర్స్ ఎక్స్‌క్లూజివ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కూడా రూ. 884 కోట్ల విలువైన లావాదేవీలను నిర్వహించిందని.. అయితే బ్యాంకుల్లో కేవలం రూ.70 కోట్లు మాత్రమే చూపిందని బ్యాంకులు అంటున్నాయి.