Crime News: ఆడవాళ్లను చంపడమే అతని లక్ష్యం.. పెందుర్తి వరుస హత్యల మిస్టరీ కేసును ఛేదించిన పోలీసులు.. విచారణలో నమ్మలేని నిజాలు

విశాఖ పెందుర్తిలో వరుస హత్యల మిస్టరీ కేసును పోలీసులు ఛేదించారు. వారం రోజుల వ్యవధిలో మూడు హత్యలు చేసి విశాఖ వాసులను వణికించిన సైకో కిల్లర్ ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. సైకో క్లిలర్ రాంబాబు ఈ హత్యలకు పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేశారు.

Crime News: ఆడవాళ్లను చంపడమే అతని లక్ష్యం.. పెందుర్తి వరుస హత్యల మిస్టరీ కేసును ఛేదించిన పోలీసులు.. విచారణలో నమ్మలేని నిజాలు

cp Srikanth

Crime News: విశాఖ పెందుర్తిలో వరుస హత్యల మిస్టరీ కేసును పోలీసులు ఛేదించారు. వారం రోజుల వ్యవధిలో మూడు హత్యలు చేసి విశాఖ వాసులను వణికించిన సైకో కిల్లర్ ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. సైకో క్లిలర్ రాంబాబు ఈ హత్యలకు పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ శ్రీకాంత్ మీడియాకు వెల్లడించారు. కుటుంబానికి దూరంకావడంతో నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని, మహిళలను హత్యలు చేయడమే అతను లక్ష్యంగా పెట్టుకుని ఇలాంటి దారుణాలకు పాల్పడ్డాడని తెలిపారు. 2018లో రాంబాబు భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం చూసి తట్టుకోలేక పోయిన నిందితుడు భార్యకు విడుకులు ఇచ్చాడని, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ అతన్ని దగ్గరకు రానివ్వలేదని అన్నారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ సంస్థలో ఏజెంట్ గా పనిచేసి మోసపోయాడని, కొంతకాలం ఆటో నడిపి జీవనం సాగించాడని తెలిపారు.

Crime News: భార్యకు వీడియోకాల్ చేసి లైవ్‌లోనే ఆత్మహత్య చేసుకున్న భర్త.. అసలేం జరిగిందంటే..

మహిళలపై కక్ష పెంచుకున్న సైకో కిల్లర్ రాంబాబు.. శారీరక వాంఛతో ఆడవాళ్లను చంపడమే లక్ష్యంగా పెట్టుకుని హత్యలకు పాల్పడ్డాడని సీపీ తెలిపారు. వారం రోజుల క్రితం వాచ్ మెన్ దంపతులను హత్య చేశాడని, ఆ చంపిన వాళ్లలో మహిళ ఉన్నారా లేదా అనేది తెలుసుకునేందుకు ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసేవాడని, వాటిపై తన్నేవాడని తమ విచారణలో తేలిందన్నారు. వారం తర్వాత మరో మహిళను హత్య చేశాడని, ఇలా మూడు హత్యలకు కారణమయ్యాడని అన్నారు.

Crime News: జిమ్ ట్రైన‌ర్‌తో వివాహిత అక్ర‌మ సంబంధం.. అడ్డొస్తున్నాడ‌ని భ‌ర్త‌ను దారుణంగా.

అంతకుముందు అద్దెకు ఉన్న ఇంట్లో క్షుద్ర పూజలు చేసేవాడని, దేవుడు వస్తున్నాడంటూ పిచ్చిపిచ్చిగా అరవడంతో ఇంటి యాజమానులు ఖాళీ చేయించారని అన్నారు. కొడుకు, కూతురు దగ్గరకు రానివ్వకపోవటంతో దేవాలయాల్లో, ఇతర ప్రాంతాల్లో తింటూ బతికేవాడని, హంతకుడు రాంబాబు మానస్థిక స్థితి బాగాలేదని, అప్పటి నుంచి ఈ హత్యలు చేయడం ప్రారంభించాడని సీపీ అన్నారు. ఆదివారం జరిగిన హత్య నేపథ్యంలో పూర్తి నిఘా పెట్టిన పోలీసులు ఘటన స్థలం దగ్గరలో ఉన్న పొదల్లో నుంచి వస్తున్న సమయంలో రాంబాబును ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పాడని, అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. అయితే సైకో కిల్లర్ గతంలో ఇంకా ఏమైనా హత్యలకు పాల్పడ్డాడా అనే విషయాలను తెలుసుకొనేందుకు విచారిస్తున్నామని సీపీ శ్రీకాంత్ వివరించారు.