Retired Navy Man Murder: పశ్చిమ బెంగాల్‌లో దారుణం.. తల్లితో కలిసి తండ్రిని హత్యచేసిన కొడుకు.. శరీరాన్ని ఆరు ముక్కలుగా చేసి..

ఢిల్లీలో జరిగిన దారుణమైన శ్రద్దా వాకర్ హత్యకేసును పోలిన తరహా ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రిటైర్డ్ ఇండియన్ నేవీ జవాన్ ను కొడుకు హత్యచేశాడు. అనంతరం తల్లితో కలిసి శరీర భాగాలను ఆరు ముక్కలుగాచేసి సమీపంలోని చెరువు, చెట్ల పొదల్లో పడేశాడు. రాష్ట్రం బరుయ్‌పూర్‌లోని హరిహర్‌పూర్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

Retired Navy Man Murder: పశ్చిమ బెంగాల్‌లో దారుణం.. తల్లితో కలిసి తండ్రిని హత్యచేసిన కొడుకు.. శరీరాన్ని ఆరు ముక్కలుగా చేసి..

Retired Navy Man Murder

Retired Navy Man Murder: ఢిల్లీలో జరిగిన దారుణమైన శ్రద్దా వాకర్ హత్యకేసును పోలిన తరహా ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రిటైర్డ్ ఇండియన్ నేవీ జవాన్ ను కొడుకు హత్యచేశాడు. అనంతరం తల్లితో కలిసి శరీర భాగాలను ముక్కలుగాచేసి సమీపంలోని చెరువు, చెట్ల పొదల్లో పడేశాడు. రాష్ట్రం బరుయ్‌పూర్‌లోని హరిహర్‌పూర్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. చెరువులో ఛిద్రమైన మొండెం తేలడంతో పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టిపడేశారు. ఒంటిపై అనేక గాయాలు ఉన్నాయి. మృతుడిని ఉజ్వల్ చక్రవర్తి (55)గా గుర్తించారు.

Shraddha Murder Case: ఆరోజు రాత్రంత్రా శ్రద్ధా శవం పక్కనే గంజాయి సిగరేట్లు తాగిన ఆఫ్తాబ్.. పోలీసుల విచారణలో వెలుగులోకి కిల్లర్ ఘోరాలు ..

మృతుడు 12ఏళ్ల క్రితం నేవీ నుండి రిటైర్డ్ అయ్యాడు. పోలీసులు మృతుడు భార్య శ్యామాలి(48), కొడుకు జాయ్(25)ను అదుపులోకి తీసుకొని విచారించారు. డబ్బుకోసం ఘర్షణ జరిగిన సమయంలో జాయ్ తన తండ్రిని హత్యచేసినట్లు విచారణలో అంగీకరించారు. పాలిటెక్నికల్ చదువుతున్న జాయ్ పరీక్షకు హాజరు కావడానికి రూ.3వేలు అడిగాడు. ఉజ్వల్ కొడుకు జాయ్‌కి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో పాటు చెప్పుతో కొట్టాడు. తీవ్రకోపోద్రిక్తుడైన కొడుకు తండ్రిని తోసేసి అతని తలపై బలంగా కొట్టాడు. అనంతరం గొంతుకోసి హత్యచేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు.

Aftab and Shraddha: కోపం వచ్చినప్పుడల్లా శ్రద్ధ తలతో మాటలు.. సైకో అఫ్తాబ్‌

నవంబర్ 13న ఈ ఘటన చోటుచేసుకుందని, తన భర్తను కొడుకు హత్యచేసే సమయంలో ఆపేందుకు ప్రయత్నించానని, అయితే, చాలా ఆలస్యం అయిందని, తన భర్త అప్పటికే చనిపోయాడని పోలీసుల విచారణలో మృతుడి భార్య శ్యామాలి తెలిపింది. అనంతరం.. తల్లి, కొడుకు మృతదేహాన్ని బాత్రూంలోకి లాగారు, జాయ్ రంపంతో తండ్రి శరీరాన్ని ఆరు ముక్కలు చేశాడు. ఆ రాత్రి, జాయ్ వారి ఇంటికి 500 మీటర్ల దూరంలో ఉన్న పొదల్లో చేతులు, కాళ్లను పడేశాడు. మరుసటి రోజు బాత్రూంలో గోనె సంచిలో మొండెంను ఉంచి ఇంట్లోనే ఉన్నారు. మరుసటిరోజు జాయ్ తన సైకిల్‌పై మొండెం తీసుకొని సమీపంలోని చెరువులో పడేశాడు. ఘటన జరిగిన రెండురోజుల తర్వాత ఉజ్వల్ కనిపించడం లేదని బరుయ్‌పూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు వారిని ప్రశ్నించగా.. భయంతో ఉన్నట్లు గుర్తించారు. అనుమానంతో వీరిని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఉజ్వల్ నిత్యం మద్యం సేవించడంతోపాటు పొరుగువారితో గొడవల కారణంగా ఇబ్బందులకు గురై తల్లీ, కొడుకు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.