బాసరలో ఛేజింగ్ : బైక్లపై దొంగలు..కార్లలో పోలీసులు
బాసరలో అర్ధరాత్రి భారీ ఛేజింగ్ జరిగింది. బైక్లపై దొంగలు..కార్లలో పోలీసులు..అచ్చు సినిమాల్లాగానే జరిగింది. దొంగలను పట్టుకొనేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు జరిపారు. చివరకు కొంతమందిని మాత్రమే పట్టుకోగా మిగతా వారు వాహనాలను వదిలి పరారయ్యారు.
బాసర రైల్వేస్టేషన్లో మే 10వ తేదీ శనివారం 20 మంది దొంగలు హల్ చల్ చేశారు. రైళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. పార్కింగ్లో ఉన్న మూడు వాహనాలను చోరీ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడకు చేరుకుని..రైల్వే పోలీసుల సహాయం కోరారు. పోలీసులను చూసిన దొంగలు బైక్లపై పారిపోయేందుకు ప్రయత్నించారు. కార్లల్లో వెంబడించారు. కొంతమందిని మాత్రమే పోలీసులు పట్టుకున్నారు. మిగతా వారు పొలాల్లో బైక్లను వదిలి పరారయ్యారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.