తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం : రెండు వోల్వో బస్సులు ఢీకొని ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతిలో రెండు వోల్వో బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 01:47 AM IST
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం : రెండు వోల్వో బస్సులు ఢీకొని ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతిలో రెండు వోల్వో బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతిలో రెండు వోల్వో బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. చంద్రగిరి మండలం కాసిపెంట్ల వద్ద రెండు వోల్వో బస్సులు ఢీకొన్నాయి. ఏపీఎస్‌ ఆర్టీసీకి చెందిన అమరావతి వోల్వో బస్సును ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. 

పూతలపట్టు-నాయుడుపేట ప్రధాన రహదారిలోని కాసిపెంట్ల హెరిటేజ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శబరిమల నుంచి అయ్యప్ప భక్తుల బృందంతో నల్లగొండకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…విజయవాడ నుంచి కుప్పం వెళ్తున్న అమరావతి వోల్వో బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అమరావతి వోల్వో బస్సు డ్రైవర్‌ రమేశ్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు చనిపోయారు.

accident

ఈ ఘటనలో మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో కొందరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్‌లు సరిపోకపోవడంతో లారీలో తిరుపతికి తరలించారు.

క్షతగాత్రులను రూయా ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో బస్సులో ఇరుక్కున్న క్షతగాత్రులను బయటికి తీయడానికి గ్యాస్ కట్టర్‌తో బస్సులను కట్ చేసి తొలగించారుఘటనతో కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది.

acc

మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుల గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.