Ranga Reddy : కారులో పెట్రోల్ పోయించుకున్న యువకులు.. డబ్బులడిగిన సిబ్బందిపై దాడి, కార్మికుడు మృతి

రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దారుణం జరిగింది. పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో కార్మికుడు సంజయ్ మృతి చెందగా మరో కార్మికుడు గాయపడ్డారు.

Ranga Reddy :  కారులో పెట్రోల్ పోయించుకున్న యువకులు.. డబ్బులడిగిన సిబ్బందిపై దాడి, కార్మికుడు మృతి

attack

Ranga Reddy : రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దారుణం జరిగింది. పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో కార్మికుడు సంజయ్ మృతి చెందగా మరో కార్మికుడు గాయపడ్డారు. గత అర్ధరాత్రి జన్వాడలోని పెట్రోల్ బంక్ కు కారులో వచ్చిన యువకులు పెట్రోల్ పోయాలని సిబ్బందిని అడిగారు. లేదని చెప్పడంతో చాలా దూరం వెళ్లాలని ప్రాదేయపడ్డారు.
దీంతో సిబ్బంది పెట్రోల్ పోశారు.

యువకులు సిబ్బందికి కార్డు ఇచ్చారు. అయితే కార్డు పని చేయకపోవడంతో క్యాష్ ఇవ్వాలని అడిగారు. దీంతో తమ దగ్గర క్యాష్ లేదన్న యువకులు పెట్రోల్ సిబ్బందితో గొడవకు దిగి, కొట్టడంతో సంజయ్ అనే కార్మికుడు మృతి చెందారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లోనూ రికార్డు అయ్యాయి.

Attack : పెట్రోల్ డబ్బులు అడిగినందుకు సిబ్బందిపై రాళ్ల దాడి

నిందితులను జన్వాడకు చెందిన నరేందర్, మల్లేశ్, అనూప్ గా గుర్తించారు. నార్సింగ్ పోలీసులు ముగ్గురు యువకులపై మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జన్వాడలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో కూడా రికార్డు అయింది.