కిక్కు దిగింది : అబ్బాయిలతో కలిసి మందుకొట్టారని నలుగురు విద్యార్థినులు సస్పెండ్

బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి కాలేజీ యూనిఫామ్ లోనే మద్యం సేవించిన నలుగురు డిగ్రీ విద్యార్థినుల వ్యవహారం తమిళనాడు రాష్ట్రంలో సంచలనం రేపింది. దీనిపై పెద్ద రచ్చ జరిగింది.

  • Published By: veegamteam ,Published On : December 31, 2019 / 11:31 AM IST
కిక్కు దిగింది : అబ్బాయిలతో కలిసి మందుకొట్టారని నలుగురు విద్యార్థినులు సస్పెండ్

బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి కాలేజీ యూనిఫామ్ లోనే మద్యం సేవించిన నలుగురు డిగ్రీ విద్యార్థినుల వ్యవహారం తమిళనాడు రాష్ట్రంలో సంచలనం రేపింది. దీనిపై పెద్ద రచ్చ జరిగింది.

బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి కాలేజీ యూనిఫామ్ లోనే మద్యం సేవించిన నలుగురు డిగ్రీ విద్యార్థినుల వ్యవహారం తమిళనాడు రాష్ట్రంలో సంచలనం రేపింది. దీనిపై పెద్ద రచ్చ జరిగింది. తల్లిదండ్రులతో పాటు కాలేజీ యాజమాన్యానికి తలవంపులు వచ్చాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న కాలేజీ యాజమాన్యం.. అబ్బాయిలతో మందుకొట్టిన నలుగురు డిగ్రీ విద్యార్థినులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆ నలుగురిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది.

వివరాల్లోకి వెళితే.. డిగ్రీ చదువుతున్న నలుగురు యువతులు ఓ బర్త్‌డే పార్టీ సందర్భంగా బాయ్‌ ఫ్రెండ్స్‌తో కలిసి మందుకొట్టారు. అంతే కాదు.. చిందులేసి రచ్చ చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్టణం జిల్లాలో సంచలనం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మైలదుత్తురాయ్ పట్టణంలోని ధర్మాపురం అధీనం ఆర్ట్స్ కాలేజీలో నలుగురు అమ్మాయిలు డిగ్రీ సెకండియర్ చదువుతున్నారు. వీరిలో ఒకరు బీఏ ఇంగ్లీష్ లిటరేచర్, మరో ముగ్గురు బీబీఏ చదువుతున్నారు. నలుగురు అమ్మాయిల్లో ఒకరిది బర్త్‌ డే. దీంతో సీతార్ కదు గ్రామంలోని ఆమె ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రాంతం.. వారి కాలేజీకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. పుట్టిన రోజు జరుపుకుంటున్న యువతి తప్ప మిగిలిన ముగ్గురు కాలేజీ యూనిఫామ్‌లోనే బాయ్‌ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీకి హాజరయ్యారు.

అంతా కలిసి కేక్ కట్ చేశారు. ఆ తర్వాత మందు బాటిళ్లు ఓపెన్ చేశారు. అబ్బాయిలతో కలిసి అమ్మాయిలూ మందు కొట్టారు. ఆ తర్వాత డ్యాన్స్ చేశారు. తాగిన మత్తులో రెచ్చిపోయిన అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్‌తో అసభ్యకర రీతిలో అర్ధనగ్నంగా ఊగిపోయారు. ఇదంతా వీడియో తీసిన ఓ స్నేహితుడు దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే రచ్చ రచ్చ జరిగింది. 6 వారాల క్రితం ఇదంతా జరిగింది. అయితే వీడియో తెగ వైరల్ అయ్యింది.

ఈ వీడియో కాస్తా ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ స్వామినాథన్ దృష్టికి వచ్చింది. అమ్మాయిల తీరుతో షాక్ తిన్న ఆయన.. పరువు పోయిందని వాపోయారు. గురువారం(డిసెంబర్ 26, 2019) విచారణకు ఆదేశించారు. నిజమే అని నిర్దారణ చేసుకున్నాక.. క్రమశిక్షణ చర్యలకు రెడీ అయ్యారు. నలుగురు అమ్మాయిలను కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. కాగా, స్టూడెంట్స్ కాలేజీ బయట  ఏం చేసినా అది వారి వ్యక్తగతం. అయితే యూనిఫామ్ ధరించి మద్యం తాగడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రిన్సిపాల్ చెప్పారు. ఈ ఘటనతో తమ కాలేజీ ప్రతిష్ఠకు భంగం కలిగిందన్నారు. అందుకే వారికి టీసీలు ఇచ్చామని వివరించారు. 2020 జనవరి 2 నుంచి సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని ప్రిన్సిపాల్ తెలిపారు.

Also Read : స్వయంగా ఇంటికెళ్లి రూ.7లక్షలు ఇవ్వండి : కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశం