ఇంటర్ ఎగ్జామ్ రాస్తూ గుండెపోటుతో స్టూడెంట్ మృతి

  • Published By: chvmurthy ,Published On : March 2, 2019 / 08:23 AM IST
ఇంటర్ ఎగ్జామ్ రాస్తూ గుండెపోటుతో స్టూడెంట్ మృతి

సికింద్రాబాద్: ఇంటర్మీడియేట్ పరీక్షల్లో విషాదం చోటు చేసుకుంది. పరీక్ష రాయటానికి వచ్చిన విద్యార్ధి హర్ట్ ఎటాక్ తో మృతి చెందటంతో ఒక్కసారిగా పరీక్షా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ వైఎంసీఎ గవర్నమెంట్ న్యూ జూనియర్ కాలేజీలో ఒకేషనల్ గ్రూప్ రెండో సంవత్సరం చదవుతున్న గోపి రాజు, శనివారం పరీక్ష రాయటానికి సికింద్రాబాద్ ప్యారడైజ్ సెంటర్లోని శ్రీ చైతన్య కాలేజీకి వచ్చాడు.  
Read Also : నోటిఫికేషన్ వచ్చేసింది : మే 3 నుంచి తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్స్

పరీక్ష మొదలైన కొద్ది సేపటికే పరీక్ష రాస్తున్న గోపిరాజు హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడ్ని చికిత్స కోసం ఇన్విజలేటర్లు అంబులెన్స్ లో  సమీపంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలిచారు. అప్పటికే విద్యార్ధి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గోపిరాజు స్వగ్రామం ఖమ్మం జిల్లా తిరుమలాయ పల్లె మండలం ,కొక్కిరం గ్రామానికి చెందినవాడు.
Read Also : డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు వదిలిన లారీ డ్రైవర్
Read Also : 118 మూవీ రివ్యూ