న్యూఇయర్ వేడుకల్లో విషాదం : కేక్ కట్ చేసిన అనంతరం ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

కొత్త సంవత్సరాన నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాకాడు మండలం తూపిలిపాలెం సముద్రంలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు.

  • Published By: veegamteam ,Published On : January 1, 2020 / 12:50 PM IST
న్యూఇయర్ వేడుకల్లో విషాదం : కేక్ కట్ చేసిన అనంతరం ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

కొత్త సంవత్సరాన నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాకాడు మండలం తూపిలిపాలెం సముద్రంలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు.

కొత్త సంవత్సరాన నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాకాడు మండలం తూపిలిపాలెం సముద్రంలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేసిన అనంతరం ముగ్గురు సరదాగా ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ యువతి అలల తాకిడికి కొట్టుకుపోతుండగా.. మిగిలిన ఇద్దరూ ఆమెను కాపాడేందుకు సముద్రంలోనికి వెళ్లారు.
 

వీరి కేకలు విని చుట్టుపక్కల వారు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆ ముగ్గురు నీటిలో పూర్తిగా మునిగిపోయారు. మృతుల్లో ఇద్దరు యువతులు, యువకుడు ఉన్నాడు. మృతదేహాలను బయటకు తీసి నాయుడు పేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు తిరుపతి జీవకోనకు చెందిన వారిగా గుర్తించారు. 

 

మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒకేసారి ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.