కాన్పూర్ లో రైలు ప్రమాదం

  • Published By: veegamteam ,Published On : April 20, 2019 / 01:57 AM IST
కాన్పూర్ లో రైలు ప్రమాదం

ఉత్తరప్రదేశ్ లో పెను ప్రమాదం తప్పింది. కాన్పూర్ లో రైలు ప్రమాదం జరిగింది. రూమ గ్రామ శివారులో పూర్యా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. రూమ రైల్వే స్టేషన్‌ సమీపంలో శనివారం (ఏప్రిల్ 19, 2019) అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ప్రమాదం జరిగింది. మొత్తం 11 బోగీలు పట్టాలు తప్పగా.. అందులో నాలుగు పూర్తిగా బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభంవించలేదని.. ఎనిమిది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యానని అధికారులు తెలిపారు. రైలు హౌరా నుంచి ఢిల్లీ వెళ్తుంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

సమాచారం తెలుసుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులను సమీన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 900 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. వీరిని తరలించేందుకు ప్రత్యేక రైళ్లు, బస్సులు వినియోగిస్తున్నారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక పోలీసు బలగాలు, వైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సేవలు అందిస్తున్నారు. బాధిత కుటుంబాల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నెంబర్లను ఏర్పాటు చేశారు.