వామనరావు కుటుంబాలను కలవటానికి గుంజపడుగు వెళ్ళిన న్యాయవాదులు

వామనరావు కుటుంబాలను కలవటానికి గుంజపడుగు వెళ్ళిన న్యాయవాదులు

TS High courts advocates left gunjapadugu : హై కోర్టు న్యాయవాద దంపుతులు గట్టు వామనరావు,నాగమణి దంపతుల హత్యకేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ రామచంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హత్యకు గురైన వామనరావు దంపతుల కుటుంబాలను పరామర్శించేందుకు హైకోర్టుకు చెందిన సుమారు 100మంది న్యాయవాదులు ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం గుంజపడుగు బయలు దేరి వెళ్ళారు.

ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ న్యాయవాదుల హత్యకేసులో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులను పట్టుకోవటంలో తెలంగాణ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. న్యాయవాదుల కుటుంబాలకు అండగా ఉండి వారి హక్కులుకాపాడేందుకు బీజేపీ లీగల్ సెల్ అండగాఉంటుందని హామీ ఇచ్చారు.