బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై బీరు సీసాలతో దాడి ఘటనలో ట్విస్ట్

బిగ్ బాస్ సీజన్ 3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై పబ్ లో బీరు సీసాలతో దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. బుధవారం(మార్చి 5,2020) అర్థరాత్రి గచ్చిబౌలిలోని

  • Published By: veegamteam ,Published On : March 5, 2020 / 02:27 AM IST
బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై బీరు సీసాలతో దాడి ఘటనలో ట్విస్ట్

బిగ్ బాస్ సీజన్ 3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై పబ్ లో బీరు సీసాలతో దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. బుధవారం(మార్చి 5,2020) అర్థరాత్రి గచ్చిబౌలిలోని

బిగ్ బాస్ సీజన్ 3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై పబ్ లో బీరు సీసాలతో దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. బుధవారం(మార్చి 5,2020) అర్థరాత్రి గచ్చిబౌలిలోని ప్రిజమ్(prism) పబ్ లో గొడవ జరిగింది. కొందరు యువకులు రాహుల్ సిప్లిగంజ్ పై బీరు సీసాలతో దాడి చేశారు. ఈ దాడిలో రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి తలకు గాయమైంది. రక్తస్రావం అయ్యింది. రాహుల్ కింద పడిపోయాడు. సకాలంలో పోలీసులు స్పందించడంతో గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రాహుల్ చికిత్స తీసుకున్నాడు. చిన్న గాయమే అంటూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. దాడి ఘటనపై ఫిర్యాదు చేయకుండానే రాహుల్ వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. (రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి చేసింది ఎమ్మెల్యే బంధువులు, కారణం ఇదే)

రాహుల్ వెంట వచ్చిన అమ్మాయిని వేధించారు?
ఈ గొడవకు సంబంధించి రెండు వర్షన్లు వినిపిస్తున్నాయి. రాహుల్ స్నేహితులు ఒకలా, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులు మరోలా చెబుతున్నారు. రాహుల్ వెంట పబ్ కి వచ్చిన అమ్మాయి పట్ల కొందరు యువకులు అనుచితంగా ప్రవర్తించారు. ఆ యువకులను రాహుల్ నిలదీశాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. అరగంట పాటు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇరు వర్గాలు దాడులకు దిగాయి. ఒక దశలో యువకులు బీరు సీసాలతో రాహుల్ పై దాడి చేశారు. ఈ దాడిలో రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు. రాహుల్ పై దాడి చేసిన వారిలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులు కూడా ఉన్నారని సమాచారం. ఇది మొదటి వర్షన్.

రాహుల్ అనుచితంగా ప్రవర్తించాడు?
ఇక రెండో వర్సన్ విషయానికి వస్తే.. రాహులే తమను వేధించాడని ఎమ్మెల్యే రోహిత్ బంధువులు ఆరోపిస్తున్నారు. వారు ప్రతిఘటించడంతో గొడవ మొదలైందట. దాడిలో తీవ్రంగా గాయపడినా కేసు పెట్టకుండానే రాహుల్ వెళ్లిపోవడం ఈ ఆరోపణలకు బలాన్ని ఇస్తోంది. వ్యవహారం ముదరడంతో పోలీసులే ఈ గొడవని సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టే పనిలో ఉన్నారు. ఇలా రెండు వర్షన్లు వినిపిస్తుండటంతో.. రాహుల్ పై దాడి ఘటన చర్చనీయాంశంగా మారింది. అసలు తప్పు ఎవరిది? ఎవరు ఎవరిని వేధించారు? ఎవరు అనుచితంగా ప్రవర్తించారు? దాడికి అసలు బాధ్యులు ఎవరు? గొడవకు కారణం ఏంటటి? అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. 

రాహుల్ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చెయ్యలేదు:
రాహుల్ సిప్లిగంజ్ బుధవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంతో తన ఇద్దరు స్నేహితులతో కలిసి గచ్చిబౌలిలోని ప్రిజమ్(PRISM) పబ్ కి వెళ్లాడు. ఒంటి గంట ప్రాంతంలో రాహుల్, యువకులు మధ్య గొడవ జరిగింది. పైలెట్ రోహిత్ రెడ్డి బంధువులు కూడా అదే సమయంలో పబ్ లో ఉన్నారు. పైలెట్ రోహిత్ రెడ్డి వెంట వచ్చిన వారు.. రాహుల్ సిప్లిగంజ్ వెంట వచ్చిన అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారట. దాన్ని రాహుల్ నిలదీయడంతో దాడి చేశారని.. రాహుల్ ఫ్రెండ్స్ చెబుతున్నారు. రాహుల్ ఎలాంటి తప్పు చేయలేదని, ఎవరినీ వేధించలేదని వెల్లడించారు.

సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు:
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులు మాత్రం మరోలా చెబుతున్నారు. తమ వెంట వచ్చిన వారి పట్ల రాహుల్ అనుచితంగా ప్రవర్తించాడని, తమతో గొడవ పెట్టుకున్నాడని, అందుకే దాడి చేయాల్సి వచ్చిందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులు అంటున్నారు. ఇలా ఇరు వర్గాలు భిన్నవాదనలు వినిపిస్తుండంతో పోలీసులు పబ్ లోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దాని ఆధారంగా విచారణ జరపుతామని, గొడవకు అసలు కారణం ఏంటో తెలుసుకుంటామని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.

See Also | Kapil Sharma Talk Show : 33 ఏళ్ల తర్వాత సీత, రామ, లక్ష్మణ