డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి

  • Published By: veegamteam ,Published On : April 3, 2019 / 02:14 AM IST
డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి

హైదరాబాద్‌ : నగరంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదం ఇద్దరిని బలి తీసుకుంది. సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సీసీఎస్ సమీపంలో ఓ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

బోరబండ సమీపంలోని ఇందిరానగర్ కు చెందిన నవాజ్ (21), అహ్మద్ (35) మిత్రులు. సుల్తాన్ బజార్ లోని ఓ బట్టల షాప్ లో పని చేస్తున్నారు. విధులు ముగించుకుని ఇద్దరు బైక్ పై వెళ్తున్నారు. బషీర్ బాగ్ మీదుగా సీసీఎస్ మార్గంలో లక్డీకపూల్ వైపు వెళ్తుండగా నిజాం కాలేజ్ హాస్టల్ ముందు మంగళవారం రాత్రి 11 గంటల సయమంలో బైక్ డివైడర్ ను ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.