ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై పోలీసుల అత్యాచారం 

కంచె చేను మేసిన చందంగా ఇద్దరు పోలీసులు ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది.

  • Published By: veegamteam ,Published On : March 15, 2020 / 03:33 AM IST
ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై పోలీసుల అత్యాచారం 

కంచె చేను మేసిన చందంగా ఇద్దరు పోలీసులు ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది.

ప్రజల మాన ప్రాణాలను రక్షించాల్సిన పోలీసులే దారుణానికి ఒడిగట్టారు. రక్షక భటులే భక్షకభటులయ్యారు. కంచె చేను మేసిన చందంగా ఇద్దరు పోలీసులు ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పుదుచ్చేరిని చూసేందుకు ప్రతి వారాంతపు రోజుల్లో ప్రేమ జంటలు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో కడలూరుకు చెందిన రెండు ప్రేమ జంటలు శుక్రవారం పుదుచ్చేరి పరిసరాల్లో పర్యటించి రాత్రి అక్కడే బస చేశారు. 

గస్తీ విధుల్లో ఉన్న సతీష్‌ కుమార్, సురేష్‌ అనే ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ప్రేమ జంటలు ఉన్న గదుల తలుపు తట్టారు. ఒక ప్రేమ జంట తలుపు తట్టి మీ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెబుతామని, కేసులు పెడతామని బెదిరించారు. దీంతో భయపడిపోయిన ఆ ప్రేమ జంట వారికి రూ. 20 వేలు ఇచ్చి సర్దుబాటు చేసుకుంది. ఆ తర్వాత మరో ప్రేమజంట వద్దకు వెళ్లగా వారి వద్ద తగిన డబ్బు లేకపోవడంతో ప్రియుడి కళ్లెదుటే అతని ప్రియురాలిపై ఇద్దరు పోలీసులు అత్యాచారం చేశారు. 

జరిగిన సంఘటనను బయటకు చెబితే పరువు పోతుందని భావించిన ఆ జంట పుదుచ్చేరి వదిలివెళ్లిపోయారు. అయితే ఈ వ్యవహారం బయటకు రావడంతో సీనియర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారుల బృందం విచారణ చేపట్టింది. అత్యాచారం, మామూళ్లు వసూళ్ల సంఘటనలు నిర్ధారణ కావడంతో కానిస్టేబుళ్లు సతీష్‌ కుమార్, సురేష్‌లను సస్పెండ్‌ చేశారు.