USA Road Accident : అమెరికాలో రోడ్డు ప్రమాదం- ఇద్దరు తెలుగు విద్యార్ధులతో సహా ముగ్గురు మృతి

అమెరికాలోని ఇల్లినాయిస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్ధులతో పాటు స్ధానిక డ్రైవర్ మృతి చెందింది. స్ధానిక కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుఝామున ఈ ప్రమాదం జరిగింది.

USA Road Accident : అమెరికాలో రోడ్డు ప్రమాదం- ఇద్దరు తెలుగు విద్యార్ధులతో సహా ముగ్గురు మృతి

Us Car Accident

USA Road Accident :  అమెరికాలోని ఇల్లినాయిస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్ధులతో పాటు స్ధానిక డ్రైవర్ మృతి చెందింది. స్ధానిక కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుఝామున ఈ ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొన్న ఈ ఘటనలో మరో ముగ్గురు తెలుగు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు.

తెల్లవారుఝామున 5 గంటల ప్రాంతంలో వారే టౌన్ నుంచి ఈస్ట్ కేవ్ కు వేగంగా వెళుతున్న ఫియట్ కారు అదుపుతప్పి సెంటర్ లైన్ దాటి పక్కరోడ్డు  పైకి దూసుకు వెళ్లింది.  ఆసమయంలో  ఎదురుగా వస్తున్న టయోటా కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఫియట్ కారు నడుపుతున్న స్ధానిక మహిళా డ్రైవర్ మేరీ ఎ. మెయునియర్ (32) తోపాటు అందులో ప్రయాణిస్తున్న వంశీకృష్ణ పెచ్చెట్టి(23),  టయోటా కార్ నడుపుతున్న పవన్ స్వర్ణ(23) అక్కడి కక్కడే మరణించారు.

టాయోటా కార్ లో ప్రయాణిస్తున్న ఉప్పలపాటి యశ్వంత్, కాకుమాన్ కార్తీక్, డోర్న కళ్యాణ్ లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కార్తీక్ పరిస్ధితి ఆందోళన కరంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  ఈ ఐదుగురు  తెలుగు  విద్యార్ధులు కాబండేల్ టౌన్ లోని సదరన్ ఇల్లినాయిస్ యూనివర్సిటీలో ఎం.ఎస్ చేస్తున్నట్లు ఇల్లినాయిస్ స్టేట్ పోలీసు విభాగం గుర్తించింది.
Also Read : Number plate : బాబోయ్.. నెంబర్ ప్లేట్ ధర రూ. 70కోట్లు.. అక్కడంతేనట..
వీరిలో కళ్యాణ్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతుండగా… మిగిలిన వాళ్లంతా కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు. క్యాంపస్ లేక్ లోని బెకర్ పెవిలియన్ సమీపంలో జరిగిన  ప్రమాదం    తీవ్రత నేపధ్యంలో అక్కడి పోలీసులు రూట్ నెంబర్ 3 లో   కొన్నిగంటలపాట ట్రాఫిక్  నిలిపివేశారు.