Hyderabad : టోలీ‌చౌక్‌లో టైర్ల లారీ చోరి.. జీడిమెట్ల‌లో పట్టుకున్న స్ధానికులు

ఇంటి వద్ద  పార్కింగ్ చేసి ఉన్న టైర్ల లారీని దుండగుడు చోరీ చేసిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. కాగా... ఆ లారీని చోరీ జరిగిన కొద్ది గంటల్లోనే స్ధానికులు పట్టుకుని లారీ యజమానికి సమ

Hyderabad : టోలీ‌చౌక్‌లో టైర్ల లారీ చోరి.. జీడిమెట్ల‌లో పట్టుకున్న స్ధానికులు

Tyres Lorry Theft

Hyderabad : ఇంటి వద్ద  పార్కింగ్ చేసి ఉన్న టైర్ల లారీని దుండగుడు చోరీ చేసిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. కాగా… ఆ లారీని చోరీ జరిగిన కొద్ది గంటల్లోనే స్ధానికులు పట్టుకుని లారీ యజమానికి సమాచారం అందించారు.

వివరాల్లోకి వెళితే… సోమవారం రాత్రి శంషాబాద్ నుంచి రూ.20 లక్షల విలువ చేసే ఎంఆర్ఎఫ్ టైర్లను వరంగల్‌ తీసుకువెళ్లేందుకు డ్రైవర్ రహీం తన లారీలో లోడు చేయించుకున్నాడు. మార్గ మధ్యంలో టోలి‌చౌక్‌లోని తన ఇంట్లో భోజనం చేసేందుకు రాత్రి గం.10-30 కి ఇంటి  వద్ద  లారీని ఆపి ఇంట్లోకి వెళ్ళాడు. భోజనం చేసి నిద్రలోకి జారుకున్నాడు.

ఈ సమయంలో లారీలో టైర్లు గమనించిన దుండగుడు అక్కడి నుంచి లారీని దొంగిలించి తీసుకువెళ్లాడు. డ్రైవర్  రహీం వరంగల్   వెళ్లేందుకు తెల్లవారుఝూమున 3 గంటల సమయంలో  నిద్రలేచి బయటకు వచ్చి చూడగా అక్కడ టైర్ల లారీ కనిపించలేదు.  వెంటనే అతను  గోల్కోండ క్రైం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నగరంలోని పోలీసు స్టేషన్లకు సమాచారం అందించారు.

ఈలోగా… జీడిమెట్ల ప్రధాన రహదారిలో ఈరోజు  తెల్లవారు ఝూమున ఒక లారీలోంచి టైర్లు కింద పడిపోతున్నా పట్టించుకోకుండా  డ్రైవర్ లారీని నడుపుకుంటూ పోసాగాడు.  అది గమనించిన స్ధానికులకు అనుమానం వచ్చి  లారీని వెంబడించి అడ్డుకున్నారు.  దీంతో లారీని నడుపుతున్న  వ్యక్తి లారీని అక్కడ వదిలేసి పరారయ్యాడు.
Also Read : Krishna District : అప్పుల బాధతో చేనేత కుటుంబం ఆత్మహత్య
స్దానికులు లారీపై ఉన్న  నెంబరు ద్వారా   యజమాని  రహీంకు ఫోన్ లో సమాచారం ఇచ్చారు. వెంటనే రహీం గోల్కోండ పోలీసులను తీసుకుని జీడిమెట్ల ప్రాంతానికి వచ్చాడు. లారీలో రూ.70వేల విలువైన టైర్లు పోయినట్లు గుర్తించాడు. టోలి‌చౌకీలో దొంగిలించిన టైర్లను జీడిమెట్ల పరిసరాల్లో విక్రయించడానికి వచ్చాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.