బెడ్ రూంలో గొడవ : కిచెన్‌లో కత్తులు తెచ్చి.. 59సార్లు భార్యను పొడిచాడు

ఆ రోజు పండుగ. అందరూ సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఎప్పటిలానే పండుగ రోజు రాత్రి కూడా లేటుగా ఇంటికి వచ్చాడు భర్త.

  • Published By: sreehari ,Published On : May 13, 2019 / 07:55 AM IST
బెడ్ రూంలో గొడవ : కిచెన్‌లో కత్తులు తెచ్చి.. 59సార్లు భార్యను పొడిచాడు

ఆ రోజు పండుగ. అందరూ సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఎప్పటిలానే పండుగ రోజు రాత్రి కూడా లేటుగా ఇంటికి వచ్చాడు భర్త.

ఆ రోజు పండుగ. అందరూ సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఎప్పటిలానే పండుగ రోజు రాత్రి కూడా లేటుగా ఇంటికి వచ్చాడు భర్త. నేరుగా బెడ్ రూంలోకి వెళ్లి భార్యతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. భార్య ఒకటింటే.. భర్త మరొకటి అన్నాడు. గొడవ పెద్దదైంది. భర్తకు కోపం కట్టలు తెంచుకుంది. క్షణికావేశంలో ఏం చేస్తున్నాడో తెలియలేదు. ఆవేశంతో కిచెన్ లోకి వెళ్లాడు.

రెండు పదునైన కత్తులు తీసుకొచ్చాడు. అదే ఆవేశంతో భార్యపై విరుచుకుపడ్డాడు. అయ్యో పాపం అనిపించలేదు. మృగంలా మారిపోయాడు. రెండు కత్తులను మార్చి మార్చి భార్యను కసితీరా పొడిచాడు. అయినా అతడి ఆవేశం చల్లారలేదు. మళ్లీ పొడిచాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా.. 59 సార్లు గ్యాప్ లేకుండా భార్యను అతికిరాతకంగా పొడిచి చంపేశాడు. 

ఈ ఘటన యూకేలో 2018లో డిసెంబర్ లో జరిగింది. భారతీయ సంతతికి చెందిన 41ఏళ్ల అంజేలా మిట్టల్..  భర్త లారెన్స్ బ్రాండ్ (47) యూకేలో నివాసముంటున్నారు. కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. ఎప్పటిలానే.. క్రిస్మస్ రోజు రాత్రి ఇంటికి వచ్చిన భర్త బ్రాండ్.. భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో అతడు విచక్షణ కోల్పోయి.. తన భార్య మిట్టల్ ను పలుమార్లు పొడిచి హత్యచేశాడు. హత్య చేసిన అనంతరం బెడ్ రూంను శుభ్రంగా కడిగి ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ చేశాడు.

తన భార్యను తానే హత్యచేశానంటూ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. భార్య మిట్టల్ ను చంపేందుకు బ్రాండ్.. రెండు కత్తులను వాడినట్టు పోలీసులు విచారణలో గుర్తించారు. ఒక కత్తితో భార్యను పొడవడంతో అది విరిగిపోయింది. కిచెన్ లోకి వెళ్లి మరో కత్తి తీసుకొచ్చి మళ్లీ భార్యను పలుమార్లు పొడిచినట్టు విచారణలో పోలీసులు వెల్లడించారు. ఈ కేసుపై విచారించిన యూకే కోర్టు నిందితుడు బ్రాండ్ కు జీవిత ఖైదు శిక్ష విధించింది.