90శాతం కాలిన గాయాలతో…సహాయం కోసం కిలోమీటరకు పైగా నడిచిన ఉన్నావో బాధితురాలు

  • Published By: venkaiahnaidu ,Published On : December 5, 2019 / 01:09 PM IST
90శాతం కాలిన గాయాలతో…సహాయం కోసం కిలోమీటరకు పైగా నడిచిన ఉన్నావో బాధితురాలు

ఉత్తరప్రదేశ్ లో ఇవాళ(డిసెంబర్-5,2019)ఐదుగురు వ్యక్తులు ఉన్నావో అత్యాచార బాధితురాలిని సింధుపూర్ అనే గ్రామంలో సజీవదహనం చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే కాలిన గాయాలతో సహాయం కోసం బాధితురాలు కిలోమీటరకు పైగా నడించినట్లు సింధుపూర్ గ్రామస్థులు తెలిపారు. కిలోమీటరు దూరం కాలిన గాయాలతో నడిచి వెళ్లిన బాధితురాలు ఓ ఇంటి బయట పనిచేస్తున్న ఓ వ్యక్తి సాయం తీసుకుందని గ్రామస్థులు తెలిపారు.

బాధితురాలు స్వయంగా 112కి ఫోన్ చేసి పోలీసులకు ఘటన గురించి సమాచారమిచ్చిందని తెలిపారు. బాధితురాలు ఫోన్ చేసిన తర్వాతనే పీఆర్ వీ,అంబులెన్స్ వచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా బాధితురాలు మెజిస్ట్రేట్ కి కూడా తన వాంగూల్మం ఇచ్చింది. ఐదుగురు వ్యక్తులు తనను తీవ్రంగా కొట్టి సజీవదహనం చేసేందుకు ప్రయత్నించారని బాధితురాలు స్టేట్మెంట్ లో తెలిపింది.  ప్రస్తుతం లక్నోలోని ప్రభుత్వ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

కొన్ని నెలల క్రితం..ఉన్నావ్‌లో నివాసం ఉండే యువతిపై అత్యాచారం జరిగింది. తర్వాత బాధితురాలు పోలీసులకు కంప్లయింట్ చేయడంతో నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇటీవలే నిందితుడు బెయిల్‌ పై విడుదలయ్యాడు. ఫిర్యాదు చేసిన యువతిపై కక్ష పెంచుకున్నాడు.ఈ సమయంలో ఇవాళ స్థానిక కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో బీహార్ పోలీస్ స్టేషన్ పరిధి కిందకు వచ్చే సింధుపూర్ అనే గ్రామంలో యువతిపై ఒక్కసారిగా నిందితుడు..అతని నలుగురు స్నేహితులు దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.