Oklahoma: ఓ మృగాడితో వెళ్లిన ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు అదృశ్యం.. వారికోసం గాలిస్తుండగా 7 మృతదేహాలు లభ్యం

Oklahoma: ఆ ఇద్దరిలో ఓ అమ్మాయి వయసు 14. మరో అమ్మాయి వయసు 16. వారిద్దరినీ తీసుకెళ్లిన మృగాడు కూడా విగతజీవిగా కనపడ్డాడు.

Oklahoma: ఓ మృగాడితో వెళ్లిన ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు అదృశ్యం.. వారికోసం గాలిస్తుండగా 7 మృతదేహాలు లభ్యం

Oklahoma

Oklahoma: ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు కనపడకుండాపోయారు. వారి కోసం గాలిస్తున్న అధికారులకు ఆ ఇద్దరు అమ్మాయిల మృతదేహాలతో పాటు మరో అయిదుగురి మృతదేహాలు కనపడ్డాయి. ఈ ఘటన అమెరికా (United States)లోని ఓక్లహోమా (Oklahoma)లో చోటుచేసుకుంది.

ఆ ఏడుగురి మృతదేహాలను అధికారులు హెన్రియెట్టా నగరంలో గుర్తించారు. ఆదివారం ఉదయం నుంచి ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు కనపడకుండాపోవడంతో వారి కుటుంబ సభ్యులు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

అత్యాచార కేసుల్లో నిందితుడిగా ఉన్న జెస్సీ మెక్‌ఫాడెన్ (39) అనే మృగాడితో ఈ ఇద్దరు అమ్మాయిలు వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. జెస్సీ మెక్‌ఫాడెన్ సోమవారం కోర్టులో విచారణకు హాజరుకావాల్సి ఉంది. అతడు ఓ టీనేజీ అమ్మాయిని సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం చేసుకుని దురాఘతానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఆదివారం అదృశ్యమైన ఇద్దరు అమ్మాయిల పేర్లు ఇది వెస్ స్టర్ (14), బ్రిట్టనీ బ్రేవెర్ (16) అని అధికారులు చెప్పారు. ఓక్లహోమాకు 90 మైళ్ల దూరంలో హెన్రియెట్టాలో వారు చివరిసారిగా కనపడ్డారు. వారిని గాలిస్తూ వెళ్లిన అధికారులు ఓ చోట ఏడుగురి మృతదేహాలు గుర్తించారు. అందులో మూడు మృతదేహాలు వెస్ స్టర్, బ్రిట్టనీ బ్రేవెర్, జెస్సీ మెక్‌ఫాడెన్ వని అధికారులు తేల్చారు.

మిగతా నాలుగు మృతదేహాలు ఎవరివి అన్న వివరాలు తేల్చేందుకు తదుపరి విచారణ జరుపుతున్నారు. ఆ ఏడుగురు ఎలా చనిపోయారన్న వివరాలపై ఆరా తీస్తున్నారు. మృగాడు జెస్సీ మెక్‌ఫాడెన్ నివసించే ఇంటి వద్దే సోమవారం మధ్యాహ్నం వారందరి మృతదేహాలు లభ్యమయ్యాయని వివరించారు. శవపరీక్ష తర్వాత అన్ని వివరాలు తేలనున్నాయి.

Viral Food : నెయ్యిలో ‘ఈత’ కొట్టిన పరోటా .. స్వర్గానికి టికెట్ అంటూ కామెంట్లు

Ukraine Apologized: జరిగిందానికి ఎంతో చింతిస్తున్నాం.. భారత్‌కు క్షమాపణలు చెప్పిన యుక్రెయిన్