దారుణం : భర్త నల్లగా ఉన్నాడని కాల్చి చంపేసింది
భార్య..భర్తలు క్షణికావేశంలో ఘోరాలకు పాల్పడుతున్నారు. భార్యలపై భర్తలు దారుణాలకు తెగబడుతుంటే ఓ భార్య..తన భర్తను సజీవంగా కాల్చి చంపేసింది. దీనికి కారణం తెలుసుకుంటే షాక్. నల్లగా ఉన్నాడనే కారణంతో చంపేసినట్లు మృతుడి సోదరుడు వెల్లడించాడు. ఈ విషాద ఘటన ఉత్తర్ ప్రదేశ్ డిస్ట్రిక్లోని బరైలీలో చోటు చేసుకుంది. బరైలో సత్యవీర్ సింగ్కు ప్రేమ్ శ్రీ అనే మహిళతో వివాహం జరిగింది. పెళ్లయి రెండు సంవత్సరాలు అవుతోంది. వీరికి ఐదు నెలల చిన్నారి కూడా ఉంది.
ఏప్రిల్ 15వ తేదీ సోమవారం పడుకున్న సత్యవీర్ సింగ్పై పెట్రోల్ పోసి నిప్పంటించింది ప్రేమ్. మంటలు మొత్తం శరీరానికి అంటుకోవడం..కాపాడటానికి ఎవరూ ఉండకపోవడంతో అతను అక్కడికక్కడనే చనిపోయాడు. నల్లగా ఉండడంతో సత్యవీర్ని నచ్చేది కాదని..నల్లగా ఉన్నాడంటూ పలు వ్యాఖ్యలు చేసేదని మృతుడి సోదరుడు తెలిపారు. అయితే..ఇంతటి దుశ్చర్యకు తెగబడుతుందని ఊహించలేదన్నారు.
ఘటనపై పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు. సెక్షన్ 307, 302 కింద కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ సేహ్దేవ్ సింగ్ వెల్లడించారు. ఘటనలో ప్రేమ్ శ్రీ కాళ్లకు కాలిన గాయాలయ్యాయని తెలిపారు.