UP Govt Hospital Atrocity : యూపీ ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. అపస్మారకస్థితిలో ఉన్న రోగి రక్తం నాకిన కుక్క

ఉత్తరప్రదేశ్‌ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి రక్తం ధారలు కడుతున్నా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదు. ఓ కుక్క వచ్చి ఆ రక్తాన్నంతా నాకింది. ఈ ఘటన ఖుషీనగర్‌ జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది.

UP Govt Hospital Atrocity : యూపీ ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. అపస్మారకస్థితిలో ఉన్న రోగి రక్తం నాకిన కుక్క

dog licking blood

UP Govt Hospital Atrocity : ఉత్తరప్రదేశ్‌ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి రక్తం ధారలు కడుతున్నా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదు. ఓ కుక్క వచ్చి ఆ రక్తాన్నంతా నాకింది. ఈ ఘటన ఖుషీనగర్‌ జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే.. బిట్టు(24) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురవటంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడికి చికిత్స అందించేందుకు ఏ ఒక్కరూ అందుబాటులో లేరు. బెడ్‌పై ఉంచితే నేలపై పడిపోయాడు.

Uttar Pradesh : ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. చీమలు కరవడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న శిశువు మృతి

అతని రక్తం ఏరులై పారింది. అయినా ఆస్పత్రి సిబ్బంది ఎవరూ రాలేదు. అక్కడే ఉన్న ఒక కుక్క నేలపై ఉన్న రక్తాన్ని నాకింది. ఈ వీడియో వైరల్‌ కావటంతో నలుగురు వార్డు బాయ్స్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.