నిద్రిస్తున్న పిల్లలపై కూలిన గోడ : ముగ్గురు మృతి
హైదరాబాద్ హబీబ్నగర్లో విషాదం నెలకొంది. గోడకూలి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాద్ హబీబ్నగర్లో విషాదం నెలకొంది. గోడకూలి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాద్ హబీబ్నగర్లో విషాదం నెలకొంది. గోడకూలి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. రాత్రి జరిగిన ఈ ప్రమాదంతో మాన్గార్ బస్తీలో విషాదం ఏర్పడింది. అఫ్జల్సాగర్ మాన్గార్ బస్తీకి చెందిన మిఠాయిలాల్, సీమ దంపతులు.. వీరికి రోష్ని, లక్ష్మీ, పావని సంతానం. ఈ ముగ్గురూ గోడకూలడంతో చనిపోయారు.
మిఠాయిలాల్ దంపతులు పునాదులు లేకుండా సిమెంట్, ఇటుకలతో చిన్న శ్లాబ్ నిర్మించుకున్నారు. ఇదే ఇప్పుడు ప్రమాదానికి కారణమైనట్టు తెలుస్తోంది. ఇదే ఇంట్లో గబ్బార్, సురేఖ దంపతులు కూడా నివాసం ఉంటున్నారు.వీరికి వరలక్ష్మీ, గీత, ఆరోల అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. గోడకూలిన ప్రమాదంలో ఈ ముగ్గురు కూడా గాయపడ్డారు.
మిఠాయిలాల్ దంపతులు తమ పిల్లలకు భోజనం తినిపించి నిద్రపుచ్చారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో… వంట గది దిమ్మె వేడెక్కింది. అది గదికి మధ్యలో ఉన్న గోడపై పడింది. దీంతో ఆ గోడ ఒక్కసారిగా పిల్లలపై పడటంతో మిఠాయిలాల్ దంపతుల ముగ్గురు పిల్లలూ మరణించారు. అలాగే గబ్బార్ దంపతుల పిల్లలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని నిలోఫర్కు తరలించారు. చనిపోయిన మిఠాయిలాల్ చిన్నారుల మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు.
ముగ్గురు చిన్నారుల మృతితో మిఠాయిలాల్ దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. అటు గబ్బార్ పిల్లల పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు నీలోఫర్ వైద్యులు చెబుతున్నారు.