బావిలో 9 మృతదేహాల కేసు, కుటుంబ పెద్ద జేబులో కండోమ్ ప్యాకెట్, పోలీసుల్లో పెరిగిన అనుమానాలు

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో 9మంది వలస కార్మికుల మృతదేహాలు లభ్యమవడం

  • Published By: naveen ,Published On : May 23, 2020 / 12:21 PM IST
బావిలో 9 మృతదేహాల కేసు, కుటుంబ పెద్ద జేబులో కండోమ్ ప్యాకెట్, పోలీసుల్లో పెరిగిన అనుమానాలు

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో 9మంది వలస కార్మికుల మృతదేహాలు లభ్యమవడం

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో 9మంది వలస కార్మికుల మృతదేహాలు లభ్యమవడం సంచలనం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. వలస కార్మికుల మరణాలు మిస్టరీగా మారాయి. ఇవి హత్యలా? సామూహిక ఆత్మహత్యలా? అనేది అంతు చిక్కడం లేదు. గురువారం(మే 21,2020) 4 మృతదేహాలు వెలుగుచూడగా, శుక్రవారం(మే 22,2020) మరో 5 బయటపడ్డాయి. వీరిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన పశ్చిమ బెంగాల్‌ వాసులు కాగా, ఇద్దరు బీహార్‌, ఒకరు త్రిపురవాసిగా పోలీసులు గుర్తించారు. 

కుటుంబ పెద్ద జేబులో కండోమ్ ప్యాకెట్:
9 మృతదేహాల వ్యవహారంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మృతి చెందిన వారి ఫోన్లు సాయంత్రమే స్విచ్ఛాఫ్ కావడం.. కుటుంబ పెద్ద మక్సూద్ ఫోన్ మాత్రం రాత్రి 9 గంటల వరకు ఆన్‌లోనే ఉండటంతో అతడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మక్సూద్ కుమారుడి పుట్టిన రోజు వేడుకలను బుధవారం(మే 20,2020)  రాత్రి నిర్వహించగా.. అందరూ కలిసి విందు చేసుకున్నారు. గురువారం(మే 21,2020) తెల్లారేసరికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వారి ఆచూకీ కోసం గాలించగా.. బావిలో నాలుగు శవాలు కనిపించాయి. శుక్రవారం(మే 22,2020) మరో ఐదు శవాలను వెలికి తీశారు. మృతదేహాలను గుర్తించిన అనంతరం మక్సూద్ నివాసం ఉంటున్న గదులను తనిఖీ చేయగా.. అతడి జేబులో కండోమ్ ప్యాకెట్ కనిపించింది. పెళ్లై ముగ్గురు పిల్లలున్న వ్యక్తి దగ్గర కండోమ్ ఉండటం అనుమానాలకు తావిస్తోంది. దీనికి తోడు అందరి సెల్‌ ఫోన్లు సాయంత్రమే స్విచ్ఛాఫ్ కాగా.. మక్సూద్ ఫోన్ రాత్రి వరకు ఆన్‌లో ఉండటం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. 

20ఏళ్ల క్రితం బెంగాల్ నుంచి వరంగల్ కు:
పశ్చిమ బెంగాల్‌కు చెందిన మక్సూద్ కుటుంబం బతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితమే వరంగల్ వచ్చి స్థిరపడింది. మక్సూద్ భార్య, ఇద్దరు కుమారులతోపాటు… భర్తకు దూరంగా ఉంటున్న అతడి కూతురు బుస్రా, ఆమె మూడేళ్ల కొడుకు వీరితోనే ఉంటున్నారు. ఇంతకు ముందు వారు కరీమాబాద్‌లో ఉండగా… లాక్‌డౌన్ కారణంగా రాకపోకలకు ఇబ్బందిగా ఉండటంతో.. వారు పని చేసే గోదాంలో ఉన్న రెండు గదుల్లోకి మకాం మార్చారు. అదే గోడౌన్‌లో బీహార్‌కు చెందిన మరో ఇద్దరు యువకులు కూడా నివాసం ఉంటున్నారు.

చివరగా స్విచ్చాఫ్ అయిన మక్సూద్ ఫోన్:
సాయంత్రం ఆరు గంటలకు మక్సూద్ మినహా అందరి సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్ అయ్యాయి. ఏడు గంటలకి షకీల్ అనే వ్యక్తిని తన ఇంటికి రావాలని మక్సూద్ పిలిచినట్టు తెలుస్తోంది. రాత్రి 7.45 గంటలకు గోదాం యజమానితో మక్సూద్ మాట్లాడాడు. రాత్రి 9 గంటల సమయంలో అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. దీంతో సాయంత్రం నుంచి రాత్రి 9 గంటల మధ్య ఏం జరిగిందనేది తేలాల్సి ఉంది. మక్సూద్, ఆయన భార్య నిషా, కుమార్తె బస్రాతోపాటు మూడేళ్ల బాలుడి మృతదేహాలను గురువారం బావిలో నుంచి వెలికి తీశారు. శుక్రవారం మరో మృతదేహం పైకి తేలడంతో.. బావిలో నుంచి నీటిని తోడేసి మక్సూద్ కుమారులు షాబాజ్, సోహిల్ మృతదేహాలతోపాటు గోనె సంచుల గోడౌన్‌కు వాహనాలను నడిపే డ్రైవర్ షకీల్.. బిహార్‌కు చెందిన శ్రీరామ్, శ్యామ్‌ల మృతదేహాలను వెలికి తీశారు.

అక్రమ సంబంధమే కారణమా?
మక్సూద్ కూతురు బుస్రాకు వరంగల్‌లోని ఓ వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై బుస్రాకు ఆమె తల్లితో గొడవలు జరిగాయని.. దీంతో బుస్రాతో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తి వచ్చి ఘర్షణకు దిగాడని తెలుస్తోంది. ఇవి ఆత్మహత్యలే అయితే.. వీరితోపాటు డ్రైవర్‌, బిహార్‌కు చెందిన శ్రీరామ్, శ్యామ్‌ కూడా బలవన్మరణానికి పాల్పడాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. వివాహేతర సంబంధం వల్లే వీరందర్నీ హత్య చేశారా? అనే అనుమానాలూ తలెత్తుతున్నాయి. వీరందరికీ ఆహారంలో విషం కలిపి ఇచ్చిన మక్సూద్.. స్పృహ కోల్పోయాక వారిని బావిలోకి తోసేసి ఉంటాడని.. తర్వాత అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.

వాళ్లే బావిలోకి దూకారా? ఎవరైనా తోసేశారా?
కాగా, పోలీసులతో పాటు అందరూ పోస్టుమార్టం కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ క్రమంలో అన్ని మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు తెలిశాయి. వాళ్లంతా బతికి ఉండగానే బావిలో పడినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. అంటే వారిని చంపి బావిలో ప‌డేయ‌లేద‌ని తేలింది. వారు నీట మునిగే మ‌ర‌ణించార‌ని, బావిలో ప‌డే స‌మ‌యంలో తాకిన చిన్న చిన్న గాయాలు మృత‌దేహాల‌పై ఉన్నాయ‌ని వ‌రంగ‌ల్ ఎంజీఎం వైద్యులు ప్రాథ‌మిక పోస్టుమార్టం నివేదిక ఇచ్చారు. మరి వాళ్లంతట వాళ్లే నీళ్లలోకి దూకారా? లేదంటే విషం, మత్తులాంటిది ఇచ్చి బతికి ఉండగానే బావిలోకి తోసేశారా అనేది తెలియాల్సి ఉంది.