నల్గొండ ప్రణయ్‌ హత్య గుర్తుందిగా.. గుంటూరులో ప్రేమజంటకు బెదిరింపులు

  • Published By: naveen ,Published On : September 22, 2020 / 01:38 PM IST
నల్గొండ ప్రణయ్‌ హత్య గుర్తుందిగా.. గుంటూరులో ప్రేమజంటకు బెదిరింపులు

గుంటూరులో ప్రేమజంట బెదిరింపులకు గురవుతోంది. జులైలో కుతాంతర వివాహం చేసుకున్న దిలీప్, సౌమ్యకు పేరెంట్స్‌ నుంచి వేధింపులు మొదలయ్యాయి. దిలీప్‌ను సౌమ్య తల్లిదండ్రులు బెదిరింపులకు గురిచేస్తున్నారు.


నల్గొండ ప్రణయ్‌ హత్య గుర్తిందిగా అంటూ భయపెడుతున్నారు. అరండల్‌పేట పోలీసుల అండతో సౌమ్యను ఇంటి నుంచి లాక్కెళ్లారు. ఇంట్లో ఉన్న దిలీప్ తల్లిని కొట్టి యువతిని తీసుకెళ్లిపోయారు. దీంతో దిలీప్ ఎస్పీని ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.


”మేము ఇద్దరమూ మేజర్లమే. అమ్మాయి వాళ్ల నాన్న వచ్చాడు. నన్ను చంపేస్తామని బెదిరించారు. మరో ప్రణయ్ ని చేస్తాను. నేను ఊరుకోను అని అమ్మాయి తండ్రి బెదిరించాడు. వాళ్ల ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డుకి ఈడుస్తాను అని యువతితో ఆమె తండ్రి చెప్పాడు అని దిలీప్ తెలిపాడు. ఆ అమ్మాయి కాళ్లు, చేతులు కట్టేసి తీసుకెళ్లారు. బొడ్డులో కత్తి పెట్టారు. అమ్మాయిని, నన్ను ఏం చేయాలని అనుకుంటున్నారు. అమ్మాయి గర్బవతి. ఇప్పుడు రెండో నెల. గర్భంతో ఉన్న ఆడపిల్లను తీసుకెళ్లి ఏం చేయాలని అనుకుంటున్నారు. చంపేస్తారా? మమ్మల్ని బతకనివ్వరా? అమ్మాయిని నా ముందుకు తీసుకురావాలి. నాతో మాట్లాడించాలి. నేను వచ్చేస్తాను, నువ్వు లేకపోతే నేను బతకలేను అని అమ్మాయి నాకు రెండు సార్లు ఫోన్ చేసింది. ఫోన్ రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. నాకు న్యాయం చేయాలి. నా భార్య నాకు కావాలి” అని దిలీప్ అన్నాడు.

love couple

దిలీప్ ది గుంటూరు. సౌమ్యది విజయవాడ. మూడేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. సౌమ్య కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు వారిద్దరిని విచారించారు. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు జోక్యం చేసుకోలేకపోయారు. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారం రోజుల క్రితం అమ్మాయి తండ్రి వచ్చాడు. తనతో పాటు వచ్చేయాలని అమ్మాయిపై ఒత్తిడి తెస్తున్నాడు. అంతేకాదు సౌమ్య తండ్రి దిలీప్ ను బెదిరించాడు. చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో దిలీప్ పోలీసులను ఆశ్రయించాడు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు.