పెళ్లిబస్సు బోల్తా – ఏడుగురి దుర్మరణం

పెళ్లిబస్సు బోల్తా – ఏడుగురి దుర్మరణం

Wedding bus from Karnataka falls on house in Kerala’s Kasaragod, 7 killed : కర్ణాటక-కేరళ సరిహద్దుల్లో పెళ్లి బృందంతో హుషారుగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఏడుగురు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకాలోని వధువు ఇంటినుంచి, కేరళలోని కొడుగు జిల్లాలోని వరుని ఇంటికి వెళ్లటానికి ఆదివారం ఉదయం 60 మందితో కూడిన పెళ్ళి బృందం బస్సులో బయలు దేరింది.

వీరి బస్సు కేరళలోని కాసరగోడ్‌ జిల్లా పాణత్తూర్‌ మీదుగా ప్రయాణిస్తుండగా …. డ్రైవర్‌ అదుపు తప్పి రోడ్డు పక్కన ఒక పెంకుటిల్లుని ఢీకొట్టాడు. దీంతో బస్సు బోల్తా పడింది.ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరూ ఆస్పత్రిలో మరణించారు. మరో ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

గాయపడిన వారిని కాసరగోడ్ ఆస్పత్రికి తరలిచారు. మరణించిన వారంతా కొడగు జిల్లాకు చెందినవారేనని తెలిసింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. ఈ దుర్ఘటనపై కేరళ సీఎం పినరయ్ విజయన్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణాలపై విచారణ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది.