Maharashtra : నాకు చెప్పకుండా పానీపూరి ఎందుకు తెచ్చావ్ అంటూ భార్య ఆత్మహత్య

నాకు చెప్పకుండా ఇంటికి పానీపూరి ఎందుకు తెచ్చవంటూ..భర్తతో గొడవకు దిగిందో ఓ ఇళ్లాలు. ఈ ఘర్షణ చిలికిచిలికిగాలి వానలా మారిపోయింది.

Maharashtra : నాకు చెప్పకుండా పానీపూరి ఎందుకు తెచ్చావ్ అంటూ భార్య ఆత్మహత్య

Panipuri

Pani Puri : పానీ పూరి..ఓ కుటుంబంలో చిచ్చు పెట్టింది. నాకు చెప్పకుండా ఇంటికి పానీపూరి ఎందుకు తెచ్చవంటూ..భర్తతో గొడవకు దిగిందో ఓ ఇళ్లాలు. ఈ ఘర్షణ చిలికిచిలికిగాలి వానలా మారిపోయింది. దీంతో ఆ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. అయితే…గత కొన్ని రోజులు నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

Read More : Gopichand : ఫ్రెండ్ సినిమా కోసం ప్రభాస్..

వివరాల్లోకి వెళితే…

షోలాపూర్లో గహినీనాథ్, ప్రతీక్ష దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 2019లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడున్నాడు. గహినీనాథ్ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే..వివాహం జరిగిన తర్వాత..కొద్ది రోజుల తర్వాత..వీరిద్దరి మధ్య ఘర్షణలు చోటు చేసుకొనేవని తెలుస్తోంది.

Read More : Covid – 19 : భారత్ లో పెరిగిన కరోనా కొత్త కేసులు, మరణాలు

కొన్ని సంవత్సరాల క్రితం పూణెకు వచ్చి స్థిరపడ్డారు. ఎప్పటిలాగే ఆఫీసుకు వెళ్లిన గహినీనాథ్…సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు పానీపూరి తీసుకొచ్చాడు. దీనిపై ప్రతీక్ష ఆగ్రహం వ్యక్తం చేసింది. పానీపూరి విషయంల ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరుసటి రోజు..గహినీనాథ్ ఆఫీసుకు వెళ్లే సమయంలో టిఫిన్ కూడా ఇవ్వలేదు.

Read More : Hyderabad : ఓఆర్‌ఆర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎంపీటీసీ, ఆమె భర్త మృతి

అనంతరం మనస్థాపానికి గురై విషం తాగి తీవ్ర అస్వస్థతకు గురైంది. స్థానికులు గమనించి..ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ చనిపోయింది. ప్రతీక్ష తండ్రి భారతి విద్యాపీఠ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గహినీనాథ్ ను అరెస్టు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.