Kurnool : కొడుకుల భయంతో..! భర్త మృతదేహానికి ఇంట్లోనే చితి పేర్చిన భార్య.. గుండెలు పిండే విషాదం

Kurnool : కుమారులిద్దరూ తమను చూసుకోవడం లేదని, ఆస్తి కోసమే తమ వద్దకు వచ్చేవారని లలిత తెలిపిందని పోలీసులు వెల్లడించారు.

Kurnool : కొడుకుల భయంతో..! భర్త మృతదేహానికి ఇంట్లోనే చితి పేర్చిన భార్య.. గుండెలు పిండే విషాదం

Funeral At Home (Photo : Google)

Funeral At Home : కర్నూలు జిల్లా పత్తికొండలో విషాదం చోటు చేసుకుంది. మృతి చెందిన భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించింది భార్య. పట్టణానికి చెందిన హరికృష్ణ ప్రసాద్(60), లలిత భార్యాభర్తలు. మెడికల్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు దినేశ్ కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తుండగా.. రెండో కొడుకు కెనడాలో స్థిరపడ్డాడు.

సోమవారం ఉదయం హరికృష్ణ ప్రసాద్ ఇంటి నుంచి పొగలు రావడాన్ని స్థానికులు గమనించారు. అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు లలితతో మాట్లాడారు. షాకింగ్ విషయాలు తెలుసుకున్నారు. తన భర్త అనారోగ్యంతో సోమవారం ఉదయం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు లలిత. కుమారులిద్దరూ తమను చూసుకోవడం లేదని, ఆస్తి కోసమే తమ వద్దకు వచ్చేవారని లలిత తెలిపిందని పోలీసులు వెల్లడించారు. తండ్రి చనిపోయిన విషయం తెలిస్తే కొడుకులిద్దరూ వచ్చి ఆస్తి కోసం గొడవ చేస్తారనే భయంతో తానే భర్తకు అట్టపెట్టలతో దహన సంస్కారాలు చేసినట్లు లలిత తెలిపారు.

Also Read..Chicken : వార్నీ.. భార్య చికెన్ వండలేదని భర్త ఆత్మహత్య

అయితే భర్త దహన సంస్కారాలు చేసిన లలిత తన కొడుక్కి వీడియో కాల్ చేసిన సమాచారం ఇచ్చారు. వెంటనే అతడు పత్తికొండకు చేరుకున్నాడు. అయితే, స్థానికులు మాత్రం లలిత మాటలను విశ్వసించడం లేదు. వృద్ధుడు అయిన తన భర్తకు సేవలు చేయలేకనే లలిత ఈ దారుణానికి పాల్పడిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిద్రిస్తున్న భర్తపై అట్టముక్కలు పేర్చి నిప్పు అంటించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

Also Read..Delhi Girl Case : ఢిల్లీలో 16ఏళ్ల బాలిక దారుణ హత్య.. నిందితుడు సాహిల్ అరెస్ట్.. షాకింగ్ వీడియో