భర్త మిస్సింగ్ – చంపి, ఇంట్లోనే పూడ్చిపెట్టిన భార్య

భర్త మిస్సింగ్ – చంపి, ఇంట్లోనే పూడ్చిపెట్టిన భార్య

wife murdered her husband and buried him in the house at vanasthalipuram : హైదరాబాద్ వనస్ధలిపురంలో దారుణం జరిగింది. భర్తతో తరచూ గొడవలు జరుగుతూండటంతో భార్య భర్తనుచంపి ఇంట్లోనే పాతి పెట్టినఘటన వెలుగు చూసింది.

రెండేళ్ల క్రితం మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన గగన్ అగర్వాల్ అనే వ్యక్తి గతేడాది జూన్ లో పాతబస్తీకి చెందిన నౌసిన్ బేగం(మరియద) అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈక్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి గగన్ కనిపించకుండా పోయాడు.

ఈ క్రమంలో భర్త కనవిపించటంలేదిన నౌసీన్ , గగన్ సోదరుడు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా కేసు వనలభార్య నౌసిన్ బేగంను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పోలీసులే షాక్ కు గురయ్యారు.

పెళ్లైన కొద్ది రోజులనుంచే గగన్ కు అతనిరెండో భార్య నౌసీన్ కు మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. దీంతో ఇద్దరికీ రోజు గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ గొడవలతో విసుగు చెందిన నౌసిన్ భర్తను హత్య చేసి ఇంట్లోనే పాతి పెట్టింది. అనంతరం ఆమె ఎల్బీనగర్ పోలీసులకు పిర్యాదు చేసి పాతబస్తీకి వెళ్లిపోయింది.

అదే సమయంలో అగర్వాల్ కనపడటక పోవటంతో అతని తమ్ముడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కేసు వనస్ధలిపురం పోలీసులు కేసును ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందని అక్కడకు బదిలీ చేశారు.

కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నౌసీన్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె పొంతన లేని సమాధానులు చెప్పటంతో అనుమానం వచ్చిన పోలీసులు అమెను తమదైన స్టైల్లో విచారించే సరికి నిజం వప్పుకుంది. రోజు గొడవలు పడుతున్నభర్తను తానే హత్య చేసి ఇంట్లో పూడ్చి పెట్టినట్లు ఆమె అంగీకరించింది. పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి మృతదేహాన్ని వెలికి తీసే పనిలో పడ్డారు.