Husband Kills Wife : పెళ్లైన 10 ఏళ్లకు భార్యకు కలిగిన కోరిక… కుదరదన్న భర్త…..!

పెళ్లైన 10 ఏళ్లపాటు వారిసంసారం సాఫీగా సాగింది. అప్పటినుంచి ఆమె మనసులో ఒక కోరిక కలిగింది. పిల్లలతో అమ్మా అనిపిలిపించుకోవాలనే కోరిక కలిగింది. భర్తకు ఈవిషయం చెప్పింది. భర్త వద్దన్నాడు

Husband Kills Wife : పెళ్లైన 10 ఏళ్లకు భార్యకు కలిగిన కోరిక… కుదరదన్న భర్త…..!

Husband Kills Wife

Husband Kills Wife : వాళ్ళిద్దరిదీ ప్రేమ వివాహం… నాలుగేళ్లు సహజీవనం చేసి ఒకరినొకరు అర్ధం చేసుకుని అప్పుడు పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన 10 ఏళ్లపాటు వారి సంసారం సాఫీగా సాగింది. అప్పటి నుంచి ఆమె మనసులో ఒక కోరిక కలిగింది. పిల్లలతో అమ్మా అని పిలిపించుకోవాలనే కోరిక కలిగింది. భర్తకు ఈవిషయం చెప్పింది. భర్త వద్దన్నాడు. దీంతో వారిద్దరి మధ్యగొడవలు మొదలయ్యాయి. చివరకు ఆమె భర్త ఆమె ప్రాణాలు తీశాడు.

ఢిల్లీలోని ఓ ల్యాబ్ లో అసిస్టెంట్ గా పని చేసే గులాబో దేవి అనే వితంతు మహిళకు 2007 లో బాబూలాల్ మీనా అనే వ్యక్తితో పరిచయం  ఏర్పడింది.  1994లో భర్తను కోల్పోయిన గులాబో దేవికి బాబూలాల్ పరిచయంతో జీవితం ఆనందంగా ఉండసాగింది. వీరిద్దరూ నాలుగేళ్లు సహజీవనం  చేసి ఒకరినొకరు అర్ధం చేసుకని 2011 లో పెళ్లి చేసుకున్నారు.

Also Read : Mahalaya Amavasya 2021 : మహాలయ అమావాస్య విశిష్టత
అనంతరం రూ.17 లక్షలతో ఒక ప్లాట్ కొనుగోలు చేసి హ్యపీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్లాట్ కొనుగోలు చేసేటప్పుడు గులాబోదేవి రూ.5లక్షలు సహాయం కూడా చేసింది.  ఆ తర్వాత నజమ్ గడ్ లో మరో ప్లాట్ ను కొనుగోలు చేశారు.  ఈ ఆస్తులన్నీ గులాబో దేవి పేరు మీద ఉన్నాయి.  ఈక్రమంలో గులాబో దేవికి అందరు మహిళలాగానే ఒక కోరిక పుట్టింది.

పిల్లలతో అమ్మా అని పిలిపించుకోవాలనే కోరిక కలిగింది. ఈవిషయాన్ని భర్త బాబూలాల్ కు చెప్పింది. అందుకు బాబూ లాల్ ఒప్పుకోలేదు.  తెలిసిన బంధువుల్లో ఒకరి  పిల్లవాడిని దత్తత తీసుకుందామని చెప్పింది.  అయినా బాబూ లాల్ అందుకు ససేమిరా అన్నాడు.  దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు  వచ్చాయి. పిల్లల విషయమై తరచూ గొడవలు జరగటం మొదలయ్యింది. అవసరం అయితే  పిల్లలకోసం ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పింది గులాబో దేవి.

ఈక్రమంలో గులాబో దేవి బాబూలాల్ నుంచి విడిపోయి దూరంగా జీవించ సాగింది. పిల్లల కోసం ఇంకో పెళ్లి చేసుకోటానికి సిధ్దపడింది. ఈ విషయం తెలిసిన బాబూలాల్ తట్టుకోలేక పోయాడు.  భార్యను హత్య చేయటానికి రూ.2.50లక్షల సుపారీ ఇచ్చి గులాబో దేవిని హత్యచేయించాడు.

గులాబో దేవి హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భర్త బాబూలాలే ఈహత్యచేసినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు.  ప్రాపర్టీలు అన్నీ గులాబో దేవి పేరు మీద ఉన్నాయని… ఆమె మరోక పెళ్ళి చేసుకుంటే ఆస్తిపోతుందనే అక్కసుతోనే హత్య చేయించినట్లు బాబూలాల్ ఒప్పుకున్నాడు.  పోలీసులు బాబూలాల్ తో సహా  హత్యచేసిన ముఠా సభ్యులందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.