ప్రేమించ లేదని.. లెక్చరర్ ను పెట్రోల్ పోసి తగలెట్టాడు

  • Published By: chvmurthy ,Published On : February 4, 2020 / 02:19 AM IST
ప్రేమించ లేదని.. లెక్చరర్ ను పెట్రోల్ పోసి తగలెట్టాడు

అతనికి పెళ్లైంది. భార్యా 7 నెలల కొడుకు ఉన్నారు. అయినా పెళ్లైన ఓ యువతి వెంట పడ్డాడు ..ప్రేమించమని వేధించాడు…పెళ్లై పిల్లాడు ఉన్న అతడి ప్రేమను ఆమె తిరస్కరించింది. ఇది తట్టుకోలేని అతడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘాతకం మహారాష్ట్రలోని వార్థా జిల్లా నందోరి చౌక్ లో జరిగింది.

వివరాల్లోకి వెళితే …దడోరా గ్రామానికి చెందిన అంకిత(26)కి అదే గ్రామానికి చెందిన   విక్కీ నగ్రారే (27) తో కొంతకాలంగా పరిచయం ఉంది.  విక్కీ కి పెళ్ళై, ఏడు నెలల కొడుకు ఉన్నాడు. అంకిత ఓ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తోంది. ఆమెకు పెళ్లైంది.  పెళ్లైనా కానీ, విక్కీ   ప్రేమ పేరుతో అంకిత వెంటపడి వేధించేవాడు. అతడి ప్రవర్తన నచ్చక అంకిత అతడ్ని దూరం పెట్టింది.  ఈ క్రమంలో విక్కీ  సోమవారం ఉదయం అంకిత పనిచేసే కాలేజీవద్ద కాపు కాశాడు. ఆమె కాలేజీకి రాగానే ఆమెతో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో తనతో తెచ్చుకున్న పెట్రోల్ ఆమెపై పోసి నిప్పంటించాడు.  

చుట్టుపక్కలవారు గమనించే లోపు  బైక్ పై అక్కడ్నించి పరారయ్యాడు. మంటల్లో చిక్కుకున్న అంకితను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించి ప్రాధమికి  చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం నాగపూర్ తరలించారు. ఈదాడిలో నిందితుడికి మరో ఇద్దరు సహకరించినచట్లు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. ప్రేమ విఫలం కావటంతోనే ఈ దాడికి పాల్పడినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పెళ్లైనా అతడి వేధింపులు మానలేదని…కిందటి  ఏడాది ఆత్మహత్యాయత్నం కూడా చేశాడని పోలీసులు తెలిపారు. 

విక్కీ  వేధింపుల కారణంగానే అంకిత వైవాహిక జీవితం కూడా విఛ్చినమైనట్లు ఆమె బంధువు శుభమ్ చెప్పారు.  కాగా……ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.   ఈ ఘటనపై  సత్వర విచారణ చేపడతామని నిందితుడిని కఠినంగా శిక్షిస్తామనవి  హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ప్రకటించారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.