కాలేజీకి మొబైల్ తీసుకొచ్చిందని : యాజమాన్యం మందలించడంతో విద్యార్థిని ఆత్మహత్య

కాలేజీకి మొబైల్ తీసుకొచ్చిందని యాజమాన్యం మందలించడంతో విద్యార్థినిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లోని ఉప్పలగూడలో చోటు చేసుకుంది.

  • Published By: veegamteam ,Published On : November 14, 2019 / 05:55 AM IST
కాలేజీకి మొబైల్ తీసుకొచ్చిందని : యాజమాన్యం మందలించడంతో విద్యార్థిని ఆత్మహత్య

కాలేజీకి మొబైల్ తీసుకొచ్చిందని యాజమాన్యం మందలించడంతో విద్యార్థినిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లోని ఉప్పలగూడలో చోటు చేసుకుంది.

కాలేజీకి మొబైల్ తీసుకొచ్చిందని యాజమాన్యం మందలించడంతో ఓ విద్యార్థినిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లోని ఉప్పలగూడలో చోటు చేసుకుంది. శివాజీనగర్‌కు చెందిన జయలక్ష్మీ(17) బాలాపూర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. 

విద్యార్థిని కాలేజీకి మొబైల్ తీసుకొచ్చిందని గుర్తించిన యాజమాన్యం, ఆమె తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ విద్యార్థిని బుధవారం (నవంబర్ 13, 2019) రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 

పొద్దున లేచి చూసేసరికి కూతురు చనిపోయి ఫ్యాన్ కు వేలాడడం చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.