మాస్క్ లా ముఖానికి చుట్టుకున్న స్కార్ప్ ప్రాణం తీసింది
ముఖానికి చుట్టుకునే స్కార్ప్, చున్నీలు మహిళల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. బైక్ వెనుక చక్రంలో చున్నీలు ఇరుక్కుని
ముఖానికి చుట్టుకునే స్కార్ప్, చున్నీలు మహిళల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. బైక్ వెనుక చక్రంలో చున్నీలు ఇరుక్కుని
ముఖానికి చుట్టుకునే స్కార్ప్, చున్నీలు మహిళల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. బైక్ వెనుక చక్రంలో చున్నీలు ఇరుక్కుని మృత్యువాత పడుతున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో చున్నీ కారణంగా ఓ మహిళ చనిపోవడం తీవ్ర విషాదం నింపింది. తాజాగా ఖమ్మం జిల్లాలోనూ అలాంటి తరహా ఘటనే జరిగింది. ఈసారి స్కార్ఫ్ కారణంగా మహిళ మరణించింది.
కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం పైడూరూపాడు గ్రామానికి చెందిన షేక్ మాలన్బీ (45) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని తన అన్న ఇంటికి వెళ్లింది. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించడంతో అక్కడే ఉండి పోయింది. నందిగామకు చెందిన బంధువు గఫార్ కొత్తగూడెం రావడంతో.. మాలన్ బీ అతడితో కలిసి బైక్ పై బయలు దేరింది. 40 కిలోమీటర్లు ప్రయాణించి తల్లాడ దగ్గరికి చేరుకున్నాక.. మాలన్ బీ మెడలో ఉన్న స్కార్ఫ్ బైక్ వెనుక చక్రంలో చిక్కుకుంది. ఆమె మెడకు బిగుసుకుంది. దీంతో ఆమె బండి మీది నుంచి కిందపడింది. తల భాగం రోడ్డుకు బలంగా తాకడంతో… తీవ్ర గాయాలైన ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. దాదాపు మూడు నెలల తర్వాత ఇల్లు చేరుతున్నాననే ఆనందంలో ఉన్న మాలన్ బీ చివరకు ఇలా అనూహ్యంగా ఈ లోకాన్నే వీడింది.
ఇలాంటి ఘటనే ప్రకాశం జిల్లా పామూరు మండలం భూమిరెడ్డిపల్లి దగ్గర ఇటీవల చోటు చేసుకుంది. కడప జిల్లా గోపవరం మండలం పెదపోలుగుంట గ్రామానికి చెందిన మునగల సుబ్రహ్మణ్యం, లక్ష్మీదేవి దంపతులు పనుల కోసం చీమకుర్తిలోని తమ బంధువుల దగ్గరికి వెళ్లారు. పది రోజులు గడిచినా పని దొరకకపోవడంతో.. ఆదివారం సొంతూరు బయల్దేరారు. భూమిరెడ్డిపల్లి దగ్గరికి వచ్చే సరికి ఆమె ముఖానికి చుట్టుకున్న చున్నీ బైక్ వెనక చక్రంలో ఇరుక్కుపోయింది. దీంతో వాహనం నుంచి ఆమె జారి కిందపడింది. తలకు తీవ్ర గాయం కావడంతో ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె కొడుకు ఆమె ఒడిలోనే ఉన్నాడు. తల్లితోపాటు కిందపడినా, బాబుకి గాయాలు కాలేదు.
Read: వివాహేతర సంబంధం-ఆవేశంలో భార్యను హత్య చేసిన మాజీ సైనికుడు