Updated On - 6:13 pm, Thu, 25 February 21
woman duped from man, sleeping tablets gold robbery : బస్సు ప్రయాణంలో పరిచయం అయిన మహిళ ఇంటికి వెళ్లిన వ్యక్తి ఆమెకు నిద్రమాత్రలు ఇచ్చి దొంగతనం చేసిన ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మహిళ(36) ఎర్రగడ్డలో నివాసం ఉంటుంది. గతంలో ఆమెకు బస్సులో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు.
ప్రయాణంలోనే ఇద్దరూ ఒకరి ఫోన్ నెంబర్లు ఒకరు తీసుకున్నారు. బస్సు దిగి ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయిన తర్వాత ఇద్దరూ తరచూ ఫోన్ లో స్నేహితులుగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఈక్రమంలో మహిళ ఆ వ్యక్తిని ఈ నెల 22న తన ఇంటికి ఆహ్వానించింది. ఇంటికి వచ్చిన ఆవ్యక్తి ఆమెతో కాసేపు ముచ్చటించాడు.
అనంతరం విటమిన్ టాబ్లెట్లని నమ్మించి ఆమెకు నిద్రమాత్రలు ఇచ్చివేసుకోమన్నాడు. ఆ టాబ్లెట్లు వేసుకున్న కాసేపటికి మహిళ మత్తులోకి జారుకోగా ఇదే అదనుగా భావించిన వ్యక్తి అందుబాటులో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యాడు. మెలుకవ వచ్చిన మహిళ చోరీ జరిగిన సంగతి గుర్తించి సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Corona Second Wave : తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం, పేషెంట్స్ తో నిండిపోతున్న ఆసుపత్రులు..జీహెచ్ఎంసీలో కంటైన్మెంట్ జోన్లు
COVID shots : కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో వివక్ష..కేంద్ర తీరుపై మంత్రి ఈటెల అసంతృప్తి
KTR Covid Vaccine : మీకు రూ.150, మాకు రూ.నాలుగు వందలా? కరోనా వ్యాక్సిన్ ధరపై కేటీఆర్ ఆగ్రహం
Corona Cases Telangana : తెలంగాణలో ఒక్కరోజులోనే 5,567 కరోనా కేసులు, 23 మంది మృతి
Municipal Elections : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు యథాతథం
Lock down Fear : లాక్డౌన్ భయంతో ఖాళీ అవుతున్న హైదరాబాద్..