ప్రియురాలిని చంపి మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టిన ప్రియుడు

  • Published By: veegamteam ,Published On : April 14, 2019 / 09:38 AM IST
ప్రియురాలిని చంపి మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టిన ప్రియుడు

మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌లో దారుణం జరిగింది. సూరారంకాలనీలోని కృషి స్కూల్‌ సమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళను చంపి… మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి పడవేశారు. అయితే మృతురాలు ఆర్‌సీ పురానికి చెందిన మహిళ అని పోలీసులు గుర్తించారు. ఇటీవలే ఆమెపై మిస్సింగ్‌ కేసు నమోదైనట్లు తెలిపారు. ప్రియుడే ఆమెను హతమార్చి సూట్‌కేసులో ఉంచి పరారయినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.