ప్రాణం తీసిన ఆస్తి వివాదం
నాగర్ కర్నూల్ జిల్లాలో స్థల వివాదం ఓ మహిళ ప్రాణాలు తీసింది. కోడేరు మండలం కొండ్రావుపల్లిలోని తిరుపతమ్మ అనే మహిళను బాబు గౌడ్ అనే వ్యక్తి కొట్టి చంపాడు.
నాగర్ కర్నూల్ జిల్లాలో స్థల వివాదం ఓ మహిళ ప్రాణాలు తీసింది. కోడేరు మండలం కొండ్రావుపల్లిలోని తిరుపతమ్మ అనే మహిళను బాబు గౌడ్ అనే వ్యక్తి కొట్టి చంపాడు.
నాగర్ కర్నూల్ జిల్లాలో స్థల వివాదం ఓ మహిళ ప్రాణాలు తీసింది. కోడేరు మండలం కొండ్రావుపల్లిలోని తిరుపతమ్మ అనే మహిళను బాబు గౌడ్ అనే వ్యక్తి కొట్టి చంపాడు. పోలీసుల నిర్లక్ష్యమే దీనికి కారణమని మృతురాలి కూతురు ఆరోపిస్తోంది. రెండుసార్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పింది.
పోలీసులకు ఫిర్యాదు చేశామనే కోపంతో బాబు గౌడు, కుటుంబసభ్యులతో కలిసి ఆమెపై దాడి చేశారు. ఆ దెబ్బలకు తాళలేక ఆమె మృతి చెందింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.