Extra Marital Affair : భర్తను రోకలి బండతో కొట్టి చంపిన భార్య
వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. హత్య అనంతరం సహకరించిన వ్యక్తి పోలీసులకు సమచారం ఇవ్వటంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
Extra Marital Affair : వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. హత్య అనంతరం సహకరించిన వ్యక్తి పోలీసులకు సమచారం ఇవ్వటంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన వెంకట్ రెడ్డి అనే వ్యక్తి వంట పనులు చేస్తుంటాడు. పెళ్లిళ్లకు పేరంటాలకు వంటలు చేస్తూ భార్య ఇద్దరు కుమారులతో నివసిస్తున్నాడు. అతని భార్య పెనుగొండ లక్ష్మీ వెంకట స్వామి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఈ విషయం తెలిసిన వెంకట రెడ్డి భార్యను మందలించాడు. వివాహేతర సంబంధంతో వారిద్దరి మధ్య గతంలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మే 27 శుక్రవారం రాత్రి మళ్లీ భార్య భర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
అనంతరం పడుకున్న భర్తని వెంకట లక్ష్మి రోకలి బండతో కొట్టి చంపింది. ప్రియుడు వెంకట స్వామికి ఈ విషయం చెప్పింది. వెంకట స్వామి కుమార్ అనే వ్యక్తిని తీసుకుని వెంకట లక్ష్మి ఇంటికివచ్చాడు. అక్కడ నుంచి ముగ్గురు కిలిసి వెంకట రెడ్డి మృతదేహాన్ని తీసుకుని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి వాగువద్దకు తీసుకువచ్చారు. అక్కడ మృతదేహాన్ని పూడ్చివేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
ఆదివారం కుమార్ గన్నేరువరం పోలీసులకు జరిగిన హత్య విషయం చెప్పి లొంగిపోయాడు. నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు వెంకట స్వామిని, వెంకట లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. వారు చెప్పిన ఆధారాలతో పొట్లప్లలి వాగు వద్ద పూడ్చి పెట్టిన వెంకట రెడ్డి మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.