రాజధానిలో దారుణం…కోర్టు గదిలో మహిళపై అత్యాచారం
దేశ రాజధానిలో దారుణం జరిగింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్లోని గదిలో 38 ఏళ్ల మహిళపై కోర్టులో పనిచేసే ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం మధ్యాహ్నం పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసిన బాధిత మహిళ.. తనపై అత్యాచారం జరిగినట్టుగా తెలిపారు.
లేబర్ కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులో సాయం చేస్తానని నమ్మించి నిందితుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధిత మహిళ ఆరోపించారు. మహిళ ఫిర్యాదుతో కోర్టు గదికి చేరుకున్న పోలీసులు ఆమె వాంగ్మూలం తీసుకున్నారు. అలాగే ఘటన స్థలంలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేశారు.
బాధిత మహిళ నుంచి సమాచారం వచ్చిన వెంటనే తాము వేగంగా స్పందించి ఘటన స్థలానికి చేరుకున్నట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. నిందితుడిని రాజేంద్ర సింగ్గా గుర్తించామని చెప్పారు. అతనిపై సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
నిందితుడిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే బాధితురాలు, నిందితుడు ఒకరిఒకరు ముందే తెలుసునని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడు బాధితురాలు భర్తకు కూడా స్నేహితుడేనని పోలీసులు గుర్తించారు.