పెళ్లిలో డ్యాన్స్ ఆపిందని…యువతిని కాల్చేశాడు

  • Published By: venkaiahnaidu ,Published On : December 6, 2019 / 09:49 AM IST
పెళ్లిలో డ్యాన్స్ ఆపిందని…యువతిని కాల్చేశాడు

ఉత్తరప్రదేశ్ లోని ఓ పెళ్లి వేడుకలో దారుణం జరిగింది. పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేయడం ఆపేసిందన్న ఆగ్రహంతో ఓ దుండుగుడు ఓ యువతి ముఖంపై కాల్పులు జరపడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది.డిసెంబర్-1,2019న చిత్రకూట్‌లో గ్రామ పెద్ద సుధీర్‌ సింగ్‌ పటేల్‌ కుమార్తె పెళ్లి వేడుకలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

మరో యువతితో కలిసి డాన్స్‌ చేస్తున్న యువతి నృత్యాన్ని నిలిపివేయడంతో అక్కడి ఉన్న వారిలో నుంచి ఓ వ్యక్తి డ్యాన్స్ ఆపితే కాల్చివేస్తానని హెచ్చరించడం ఆ వీడియోలో కనిపించింది. మరో వ్యక్తి ఆమెపై కాల్పులు జరపాలని అన్నంతలోనే యువతి ముఖంపైకి బుల్లెట్‌ దూసుకువచ్చింది.

బుల్లెట్‌ ఆమె దవడలోకి దూసుకుపోయింది.పెళ్లి కూతురు బంధువు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.ట్రీట్మెంట్ కోసం ఆమెను హాస్పిటల్ కు తరలించామని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో వేదికపై ఉన్న పెళ్లి కూతురు మామలు మిథిలేష్‌, అఖిలేష్‌లకు కూడా గాయాలయ్యాయి. గ్రామ పెద్ద కుటుంబ సభ్యుల్లో ఒకరు ఈ దాడికి పాల్పడినట్టు సమాచారం.