Attacked On Woman : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో దారుణం.. మహిళపై దాడి చేసి చెప్పుల దండతో ఊరేగింపు

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో దారుణం జరిగింది. వ్యక్తి మృతికి కారణమంటూ ఓ మహిళపై గ్రామస్థులు దాడి చేశారు. అంతేకాకుండా ఆమె మెడకు చెప్పుల దండ వేసి ఊరేగించారు.

Attacked On Woman : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో దారుణం.. మహిళపై దాడి చేసి చెప్పుల దండతో ఊరేగింపు

attacked

Attacked On Woman : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో దారుణం జరిగింది. వ్యక్తి మృతికి కారణమంటూ ఓ మహిళపై గ్రామస్థులు దాడి చేశారు. అంతేకాకుండా ఆమె మెడకు చెప్పుల దండ వేసి ఊరేగించారు. మున్నేరు గ్రామ సమీపంలోని శివాలయం వద్ద ఈ నెల 10న కుళ్ళిన స్థితిలో ఓ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

మృతుడు డోర్నకల్ శివారు తండావాసిగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఆ వ్యక్తి మృతికి తండాకు చెందిన ఓ మహిళ కారణమంటూ అతని సమీప బంధువులు ఆమెపై దాడి చేశారు. అలాగే ఆమె మెడలో చెప్పుల దండ వేసి ఊరేగింంచి ఘోరంగా అవమానించారు.

Hyderabad : మహిళపై దాడి ముగ్గురు యువతులు అరెస్ట్

ఈ ఘటనను డోర్నకల్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా తమకు విషయం తెలియదన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.